Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ల కాంబినేషన్లో వచ్చిన పుష్ప మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప మొదటి పార్ట్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హిందీ అత్యధిక కలెక్షన్లను వసూలు చేసింది. అయితే మొదటి పార్ట్ మూవీ రిలీజ్ అయి దాదాపుగా 7 నెలలు కావస్తోంది. అయినప్పటికీ ఇంకా రెండో పార్ట్పై ఎటూ తేల్చడం లేదు. ఏప్రిల్ నెలలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావల్సి ఉన్నా.. అనేక కారణాల వల్ల వాయిదా పడుతోంది. ఈ మూవీ షూటింగ్ను ఆగస్టు నుంచి ప్రారంభిద్దామని గతంలో అనుకున్నారు. కానీ అక్టోబర్కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఇక మూవీ షూటింగ్ వాయిదా పడడంతో రిలీజ్ తేదీలను కూడా మార్చాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే పుష్ప 2 మూవీని 2023 డిసెంబర్లో లేదా 2024 సంక్రాంతి వరకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే ఇంకో ఏడాదిన్నర వరకు వేచి చూడక తప్పదు. ఇది బన్నీ అభిమానులకు మింగుడ పడని చేదు వార్తగానే చెప్పవచ్చు. వాస్తవానికి ఏప్రిల్ నెలలో షూటింగ్ మొదలు పెట్టి త్వరగా పూర్తి చేసి డిసెంబర్ లేదా 2023 జనవరిలో మూవీని రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ అది అసలు సాధ్యపడడం లేదు. ఇక ఎప్పటికప్పుడు పుష్ప 2 షూటింగ్ తేదీలు దూరం జరుగుతూనే ఉన్నాయి. దీంతో బన్నీ అభిమానులు ఇప్పటికే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక షూటింగ్ మళ్లీ వాయిదా పడడం అలాగే రిలీజ్ తేదీలు కూడా ఇప్పట్లో లేకపోవడం.. వారికి తీవ్రమైన అసంతృప్తిని తెప్పిస్తున్నాయని చెప్పవచ్చు. దీనిపై అభిమానుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
ఇక దర్శకుడు సుకుమార్ పుష్ప 2 కథను ఇంకా సిద్ధం చేయలేదని సమాచారం. హిందీ మార్కెట్ లక్ష్యంగా ఆయన కథను రూపొందిస్తున్నారట. దీంతోపాటు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందట. కనుకనే షూటింగ్ ఆలస్యం అవుతుందని సమాచారం. ఇక బన్నీ ప్రస్తుతం ఫ్యామిలీతో గడుపుతుండగా సుకుమార్ కథను సిద్ధం చేస్తూ మరోవైపు నటీనటుల ఎంపికను చూసుకుంటున్నారు. పుష్ప మొదటి పార్ట్కు రూ.150 కోట్లు ఖర్చు కాగా రెండో పార్ట్ను రూ.400 కోట్లతో తెరకెక్కించనున్నారని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…