Pooja Hegde : హీరోయిన్ పూజా హెగ్డెకు గత ఏడాది కాలం మొత్తం బాగా కలసి వచ్చిందనే చెప్పవచ్చు. ఈ అమ్మడు ఏ చిత్రంలో నటించినా అది బంపర్ హిట్ అయింది. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా పూజా హెగ్డె ప్రస్తుతం తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిందట. అయితే అంత వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఈమెను హీరోయిన్గా తీసుకోవాలంటేనే నిర్మాతలు.. బాబోయ్ మాకొద్దు.. అనే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. మరి పూజాను వారు వద్దని చెప్పడానికి గల కారణాలు ఏమిటంటే..
పూజా హెగ్డె ఇటీవలి కాలంలో నటించిన చిత్రాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో ఈమె అమాంతం తన రెమ్యునరేషన్ను పెంచేసింది. అయితే అక్కడి వరకు ఓకే అయినా.. ఈమె సెట్కు వచ్చిందంటే చాలు.. తన టీమ్ మొత్తం ఖర్చులను నిర్మాతపైనే వేస్తోందట. అవసరం లేకపోయినా 12 మంది టీమ్ను సెట్కు తీసుకువస్తోందట. వారి ఖర్చులన్నింటినీ నిర్మాతలే భరించాల్సి వస్తోందట. దీంతో ఆమె డిమాండ్లను, ఖర్చును నిర్మాతలు భరించలేక.. ఆమె వద్దులే అని అనుకుంటున్నారట.
పూజా హెగ్డె ఆ విధంగా చేస్తున్నందు వల్లే ప్రస్తుతం ఆమె ఇంకా కొత్త సినిమాలకు సైన్ చేయలేదని తెలుస్తోంది. ఆమె నటించిన రాధే శ్యామ్, బీస్ట్ చిత్రాల షూటింగ్ పూర్తయింది. దీంతో ప్రస్తుతం పూజా ఖాళీగానే ఉంటోంది. అయితే కొందరు మీడియం బడ్జెట్ నిర్మాతలు అంతకు ముందు పూజాతో సినిమాలు తీయాలని అనుకున్నారట. కానీ ఆమె డిమాండ్లు, ఆమె పెట్టిస్తున్న ఖర్చు చూసి వెనుకడుగు వేశారట. లేదంటే ఈ అమ్మడి చేతిలో నాలుగైదు సినిమాలు ఉండేవని అంటున్నారు. మరి ఈమె రానున్న రోజుల్లో అయినా తన పంథాను మార్చుకుంటుందా.. సినిమా చాన్స్లను దక్కించుకుంటుందా.. అన్నది చూడాలి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…