Pooja Hegde : ఒక లైలా కోసం అనే మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ.. పూజా హెగ్డె. ఈ అమ్మడు కెరీర్ ఆరంభంలో నటించిన చిత్రాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈమెకు ఐరన్ లెగ్ అన్న ముద్ర పడిపోయింది. అయితే అనూహ్యంగా ఈమె పుంజుకుంది. గతేడాది కాలం నుంచి ఈమె నటిస్తున్న చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తున్నాయి. అయితే ఈ ఏడాదిలో మాత్రం ఈమెకు ఒక్క హిట్ కూడా లభించలేదు. రాధేశ్యామ్ మొదలు కొని బీస్ట్, ఆచార్య సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో పూజాకు మళ్లీ ఐరన్ లెగ్ అన్న ముద్ర పడింది. అయితే ఈ మధ్యే విడుదలైన ఎఫ్3 మూవీలో ఈమె ఐటమ్ సాంగ్ చేసి అలరించింది. పూజా కాసేపు మాత్రమే ఉన్నప్పటికీ ఈ మూవీకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు.
ఇక సోషల్ మీడియాలోనూ ఈ భామ ఎల్లప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. గతంలో ఈమె మాల్దీవ్స్ కు వెళ్లినప్పుడు సోషల్ మీడియాలో వరుసగా ఫొటోలను షేర్ చేసి సెగలు రేపింది. అయితే ఇప్పుడు షూటింగ్లతో బిజీగా ఉన్నానని, వెకేషన్కు వెళ్లలేకపోతున్నానని చెబుతూ పూజా హెగ్డె అప్పటి ఫొటోలను మళ్లీ షేర్ చేసింది. బ్లూ కలర్ డ్రెస్లో ఎద అందాలను ప్రదర్శిస్తూ పూజా చేసిన గ్లామర్ షోకు కుర్రకారు మైమరిచిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె త్రో బాక్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. పూజా త్వరలోనే మహేష్తో కలిసి త్రివిక్రమ్ సినిమాలో చేయనుంది. గతంలో ఈమె మహేష్తో కలసి చేసిన మహర్షి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక త్రివిక్రమ్ కూడా వరుస హిట్లతో జోరుమీదున్నారు. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్లో మరో హిట్ వస్తుందని అంటున్నారు. అలాగే సర్కస్, కభీ ఈద్ కభీ దివాలీ అనే హిందీ సినిమాల్లోనూ పూజా నటిస్తోంది. ఇవి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల కానున్నాయి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…