Pooja Hegde : నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ దళపతి, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం బీస్ట్. శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి అరబిక్ కుతు పాట విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఈ పాట ఎంతో క్రేజ్ ను సంపాదించుకోగా.. ఎంతో మంది ప్రముఖుల నుంచి సాధారణ అభిమానుల వరకు ఈ పాటకు రీల్స్ చేస్తూ వీడియోలను షేర్ చేశారు. ఇక ఈ పాట ఎంతో మంచి క్రేజ్ దక్కించుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ జాలీ ఓ జింఖానా అనే పాటను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రోమో ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా దర్శకుడు, సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత వాయిద్యాలను వాయిస్తూ ఉండగా.. పూజా హెగ్డె, విజయ్ ఈ పాటను ఆలపిస్తూ ఉన్నారు.
ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పూర్తి పాటను ఈ నెల 19వ తేదీ విడుదల చేయనున్నారు. ఇక ఈ ప్రోమోని పూజా హెగ్డె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రెండో రౌండ్ కు సిద్ధంగా ఉన్నారా ? ఈ పాటకు డాన్స్ చేయడం మర్చిపోకండి.. అంటూ కోరింది. మరి ఈ పాట కూడా అరబిక్ కుతు పాటలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో.. లేదో.. వేచి చూస్తే తెలుస్తుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…