Pawan Kalyan : సాయి ధరమ్ తేజ్కు చెందిన తాజా చిత్రం రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతూనే ఉంది. ఆయన వ్యాఖ్యలపై ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. కొందరు నటులు ఆయన చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలపగా.. ఏపీకి చెందిన మంత్రులతోపాటు మరికొందరు సెలబ్రిటీలు పవన్ను విమర్శించారు. ఆయన అలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అయితే ఇదే విషయంపై నటుడు పోసాని కృష్ణమురళి తాజాగా స్పందించారు.
సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఆయన ప్రశ్నలకు ఆయనే సమాధానాలు చెప్పుకుంటారని అన్నారు. పవన్ ప్రశ్నించడంలో తప్పేమీ లేదని, కానీ ఆయన అన్నమాటలకు ఆధారాలు చూపాలని అన్నారు.
పవన్ కల్యాణ్ మాట్లాడిన భాష సరిగ్గా లేదని పోసాని కృష్ణమురళి అన్నారు. చిరంజీవి ఎప్పుడూ ఈ విధంగా మాట్లాడలేదని, ఆయనతో రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ ఆయనకు వ్యతిరేకంగా తాను ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. ఏపీ సీఎం, మంత్రులను పవన్ తిట్టడం సరికాదని అన్నారు.
రెండు నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ తిరిగారని, ఒక్క చోట కూడా ఎందుకు గెలవలేకపోయారని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. సీఎం జగన్కు, పవన్కు పోలిక లేదని, సీఎం జగన్ పనితీరును దేశ మొత్తం గుర్తించిందని కొనియాడారు. రెండేళ్లలోనే ఏపీలో పాఠశాలల రూపురేఖలను జగన్ మార్చారని, అనేక సంక్షేమ పథకాలను జగన్ కొనసాగిస్తున్నారని అన్నారు.
పవన్ కల్యాణ్ అంటే ఏమిటో అందరికీ తెలుసని, ఆయనకు, జగన్కు పోలికే లేదన్నారు. చంద్రబాబును పవన్ ఎప్పుడైనా ప్రశ్నించారా ? అని పోసాని అన్నారు. కాగా పోసాని చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…