Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయనను నటుడిగానే కాకుండా వ్యక్తిత్వం ఉన్న మనిషిగా చాలా ఇష్టపడుతుంటారు. సినిమాల ద్వారా కోట్లు సంపాదించి రాయల్ లైఫ్ ను మెయింటెయిన్ చేసే సత్తా ఉన్న పవన్ కళ్యాణ్. రాజకీయాలలోకి వచ్చి ప్రజలకు తన వంతు సేవ చేస్తున్నారు. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో పాల్గొన్న విషయం తెలిసిందే.
పవన్ రావడంతో జనసైనికులతో పశ్చిమగోదావరి జిల్లా నిండిపోయింది . పవన్ ను చూడడానికి అభిమానులు పోటెత్తారు. ఇక దీంతో పోలీసులు ఎంత బందోబస్త్ పెట్టినా వారిని ఆపడం కష్టతరం అయ్యింది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ పోలీసుల బందోబస్త్ మధ్య వెళ్తుండగా జనసందోహం ఎక్కువ కావడంతో ఒక పోలీస్ అదుపుతప్పి పడిపోయాడు. పవన్ స్పందించి అంతమందిని దాటుకొని పోలీసును లేపి.. జాగ్రత్త చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై పవన్ అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అదీ.. పవన్ వ్యక్తిత్వమంటే.. అని అంటున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్గా భీమ్లా నాయక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నెక్స్ట్ మూవీ హరి హర వీర మల్లు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్ దొంగ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా బాబాయ్ నిర్మాణంలో తన సినిమా గురించి నోరు విప్పాడు రామ్ చరణ్. ఒక కథ కుదిరిన రోజు.. అది తనకు సరిపోతుంది అనుకుంటే పవన్ బాబాయ్ నిర్మాణంలో కచ్చితంగా సినిమా చేస్తాను అని తాజాగా చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.
మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే…
భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య…
మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ పవన్…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…