NTR Samantha : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు. జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి మంచి రేటింగ్ వస్తున్నాయని చెప్పవచ్చు. ఇక పోతే ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలు అతిథులుగా విచ్చేసి తమదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సమంత అతిథిగా వచ్చారు. షోలో సమంత ఎంతో చాకచక్యంగా ఆడుతూ 25 లక్షల రూపాయలను గెలుచుకున్నారు.
ఈ ఆటలో భాగంగా సమంత, ఎన్టీఆర్ లు ఎంతో సరదాగా ముచ్చటించారు. ఇందులో భాగంగా సమంత మాట్లాడుతూ.. ఎవరు మీలో కోటీశ్వరులు తదుపరి సీజన్కు మీకు బదులుగా నేను హోస్ట్ చేయవచ్చా ? అని సమంత ఎన్టీఆర్ను అడిగింది. దీంతో ఎన్టీఆర్ షాక్ అయ్యారు.
ఇక ఎన్టీఆర్.. ఇదే విషయాన్ని డిక్లేర్ చేయమంటారా.. అని కంప్యూటర్ని అడగడంతో.. అందుకు సమంత స్పందిస్తూ.. మీ ఫ్యాన్స్ కు మాత్రం చెప్పకండి.. అంటూ దండం పెడుతుంది. నా ఫ్యాన్స్ బంగారాలు అంటూ ఎన్టీఆర్ అభిమానులను పొగుడుతారు. ఇలా సమంత ఎంతో సరదాగా ఆడుతూ ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ పాతిక లక్షలు గెలుచుకొని వాటిని ప్రత్యూష ఫౌండేషన్ కు విరాళం అందించింది. అయితేె ఎవరు మీలో కోటీశ్వరులు షోకు సమంత తదుపరి సీజన్కు హోస్ట్గా వస్తుందా ? అందుకనే ఈ విధంగా చేశారా ? అన్నది ఇప్పటికైతే సందేహమే. తరువాత ఏం జరుగుతుందో చూడాలి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…