Naresh : సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్లకు ఇప్పటి వరకు ఉన్న పరువు కాస్తా పోయింది. నిన్న మొన్నటి వరకు వీరంటే అందరికీ గౌరవం ఉండేది. నరేష్ మా అసోసియేషన్లో అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు మంచు విష్ణుకు వెన్నుదన్నుగా ఉన్నారు. అలాగే అనేక సినిమాల్లోనూ నటిస్తూ గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్నారు. కానీ ఈ మధ్య జరిగిన సంఘటనలతో నరేష్ తన పేరు మొత్తం పోగొట్టుకున్నారు. ఆయనతో కలసి తిరిగేందుకు కూడా మా మెంబర్లు ఎవరూ ఇష్టంగా లేరని సమాచారం.
ఇక పవిత్ర లోకేష్ విషయానికి వస్తే.. ఆమె సినిమాల్లో ఎక్కువగా తల్లి పాత్రల్లో నటిస్తూ అసలైన మాతృమూర్తిలా అనిపించేది. కానీ ఈ వ్యవహారం మొత్తం జరిగాక ఆమె కూడా తనపై ఉన్న గౌరవం మొత్తాన్ని పోగొట్టుకుంది. ఇప్పటికే రెండు సినిమాల్లో నుంచి ఆమెను తీసేశారు. ఇలా నరేష్, పవిత్ర లోకేష్లు ఇద్దరూ మీడియాకెక్కి రచ్చ రచ్చ చేశారు. అయితే వీరు ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై ఏ మీడియా సంస్థకు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారట. అలా చేస్తే ఉన్న ఆ కాస్త పరువు కూడా పోతుందని అనుకుంటున్నారట. కనుక మీడియాతో ఇకపై మాట్లాడొద్దని.. ఆ సంస్థలకు దూరంగా ఉండాలని వీరు డిసైడ్ అయ్యారట.
ఇక నరేష్ తన భార్య రమ్యపై చట్టపరంగా పోరాటం చేసేందుకు డిసైడ్ అయ్యారట. ఆమెతో తెగదెంపులు చేసుకోవడమే కాకుండా.. పవిత్ర లోకేష్ను పెళ్లి చేసుకుని వీలైనంత త్వరగా ఈ వివాదాలకు చెక్ పెట్టాలని చూస్తున్నారట. కనుక త్వరలోనే వీరి వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని అంటున్నారు. అయితే రమ్య రఘుపతి మాత్రం నరేష్కు విడాకులు ఇవ్వబోనని.. తన భర్తతో కలసి ఉండేందుకు ఇప్పటికీ తాను సిద్ధమేనని.. తనను, నరేష్ను పవిత్ర కలవనీయకుండా అడ్డుకుంటుందని ఆరోపణలు చేసింది. మరి వీరి కథ చివరకు ఎలా ముగుస్తుందో చూడాలి.
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…