Nagarjuna : నాగచైతన్య, సమంతలు అక్టోబర్ 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. వీరి నిర్ణయంతో యావత్ సినీ ప్రపంచం ఉలిక్కి పడింది. అభిమానులు షాక్ తిన్నారు. టాలీవుడ్ క్యూట్ కపుల్గా పేరొందిన వీరు విడాకులు తీసుకోవడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోయారు. వీరి విడాకుల నిర్ణయం చాలా మందికి నచ్చలేదు.
అయితే నాగచైతన్య, సమంతల విడాకులపై నాగార్జున స్పందించారు. ఓ బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ.. సంచలన విషయాలను వెల్లడించారు. అసలు సమంతనే ముందుగా విడాకులు కావాలని అడిగిందని అన్నారు.
అయితే ఉన్నట్లుండి సడెన్ గా సమంత విడాకులు ఎందుకు అడిగిందో చైతన్యకు అర్థం కాలేదని, అతను సమంత నిర్ణయాన్ని అంగీకరించక తప్పలేదని అన్నారు. అయితే విడాకుల వల్ల తన తండ్రి ఎంతగా కుమిలిపోతాడో, తన ఫ్యామిలీ పరువు ఏమైపోతుందోనని నాగచైతన్య ఆలోచించాడని, కానీ ఇద్దరికీ ఇష్టమైతే విడాకులు తీసుకోండని చెప్పానని నాగార్జున అన్నారు.
2021 న్యూ ఇయర్ వేడుకలను కూడా సమంత, చైతన్య ఇద్దరూ కలిసి జరుపుకున్నారు. ఇంతలోనే ఏమైందో తెలియదు, సమంతనే ముందుగా విడాకులు కావాలని అడగడం ఆశ్చర్యాన్ని కలిగించింది.. అని నాగార్జున తెలిపారు.
అయితే సమంత సినిమాలు, సిరీస్లలో బోల్డ్ క్యారెక్టర్స్ చేయడం అటు చైతన్యకు, ఇటు నాగార్జునకు ఇష్టం లేదని.. అందుకనే సమంత విడాకులు తీసుకుందని అప్పట్లో వార్తలు బాగా వినిపించాయి. ఇక వారి విడాకులకు కారణం కూడా అదేనని ఇప్పటికీ చాలా మంది భావిస్తున్నారు.
భారత వన్డే జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడాలనే తన కోరికను స్పష్టంగా…
తమిళ నటుడు విజయ్ నటించిన జన నాయగన్ చిత్రం థియేట్రికల్ రిలీజ్కు మళ్లీ సిద్ధమవుతోంది. రాజకీయాల్లో పూర్తిస్థాయి ప్రవేశానికి ముందు…
వాలెంటైన్స్ డే సందర్భంగా అమెజాన్ ఇండియా ప్రత్యేక సేల్ను ప్రకటించింది. ఈ సేల్లో ఆపిల్, శాంసంగ్, వన్ ప్లస్, ఐక్యూ,…
శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స భారత ఆటగాళ్లు ప్రత్యేక బ్యాట్లు ఉపయోగిస్తున్నారన్న తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. టీ20 ప్రపంచకప్…
నటి శ్రియా శరన్ ఇప్పటికీ తన అందం, నటన, గౌరవప్రదమైన ప్రయాణంతో ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న అగ్రనాయికలలో ఒకరిగా నిలుస్తున్నారు.…
గూగుల్ తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ పిక్సల్ 10ను కొనాలనుకున్నప్పటికీ ధర కారణంగా వెనకడుగు వేసిన వారికి శుభవార్త. పిక్సల్ 10…
టీ20 వరల్డ్కప్ 2026లో ఈసారి అమెరికాతో తలపడ్డ భారత్ అతికష్టం మీద గెలిచింది. మ్యాచ్ ఆరంభానికి ముందు కొన్ని రోజుల…
చెన్నైలోని ఎం.ఏ.చిదంబరం స్టేడియం(చెపాక్)లో విజిల్లపై నిషేధం అమలులోకి వచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్లతో ఈ నిర్ణయం అమలవుతోంది.…
View Comments
Shunakamunu kanakapu simhasanambu pi koorchundabettina...