Munagaku Pachadi : కాల్షియం అనేది మన శరీరానికి ఎంతో అవసరం. మన శరీరానికి తగినంత కాల్షియం ఉన్నప్పుడే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది కాల్షియం లోపానికి గురవుతున్నారు. ఈ కాల్షియం లోపం వలన అనేక సమస్యలను తెచ్చుకుంటున్నారు. నాలుగు మెట్లు ఎక్కడం అనేది కూడా కష్టంగా ఉంటుంది. కాళ్లు నొప్పులు అనే సమస్యతో చిన్నవయసులోనే ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇలాంటి సమస్యలు దూరం చేయాలి అంటే ప్రకృతి మనకు ఎన్నో సదుపాయాలను కలుగజేసింది. ప్రకృతి మానవాళికి ఇచ్చిన వరంలో మునగాకు కూడా ఒకటి. మునగాకును రెగ్యులర్ గా ఆహారంగా తీసుకోవడం ద్వారా కాల్షియం లోపం తగ్గుతుంది. ఇప్పుడు మునగాకుతో ఒక అద్భుతమైన వంటకం ఎలా తయారు చేయాలో చూద్దాం.
మనం ఎక్కువగా మునగాకుతో పప్పు, పొడి చేసుకుంటూ ఉంటాం. కానీ అలా కాకుండా పచ్చడి చేసుకుంటే రుచిగా ఉంటుంది. పొయ్యి మీద కళాయి పెట్టి ఒక స్పూన్ మీగడ వేసి వేడి అయ్యాక ఒక స్పూన్ మెంతులు, రెండు స్పూన్ల వేరు శనగ పప్పు, అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, నాలుగు పచ్చిమిరపకాయలు వేసి వేగించి పక్కన పెట్టాలి.
ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూన్ మీగడ వేసి వేడి చేశాక రెండు కప్పుల మునగాకు వేసి ఆకు మడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్ లో ముందుగా వేగించి పెట్టుకున్న మిశ్రమాలను మెత్తగా పొడిచేసి తర్వాత మునగాకు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ నిమ్మరసం, కొంచెం పసుపు వేసి మరొకసారి మిక్సీ చేసుకుంటే ఎంతో రుచికరమైన మునగాకు పచ్చడి రెడీ.
ఈ పచ్చడి తినటం వలన మన శరీరానికి అవసరమైన కాల్షియం అంది ఎముకలు గుల్లగా మారకుండా బలంగా ఆరోగ్యంగా తయారవుతాయి. అంతేకాకుండా కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటివి ఉండవు. అలాగే విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…