Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన తీసిన గత నాలుగు చిత్రాలు వరుసగా హిట్ అయ్యాయి. భరత్ అనే నేను సినిమాతో మొదలు పెడితే.. మహర్షి, సరిలేరు నీకెవ్వరు, ఇప్పుడు సర్కారు వారి పాట.. మొత్తంగా 4 చిత్రాలు వరుసగా హిట్ అయ్యాయి. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఎంతో జోష్లో ఉన్నారు. ఇక ఆయన తరువాత సినిమా ఏమిటా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే మహేష్ తీసిన లాస్ట్ 4 చిత్రాలు అన్నీ సమాజానికి మెసేజ్ ఇచ్చేవే. దీంతో ఫ్యాన్స్ ఈసారి భిన్నమైన కథను ఎంచుకోవాలని కోరుతున్నారు. ఇక ఇప్పటికే ఆయన తన 28వ సినిమాను కూడా అనౌన్స్ చేసేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో, పూజా హెగ్డె హీరోయిన్ గా ఆయన సినిమా చేయనున్నారు. అయితే సర్కారు వారి పాటకు ఆయన రూ.50 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఈ క్రమంలోనే తన నెక్ట్స్ సినిమాకు ఆయన రూ.70 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో త్వరలోనే త్రివిక్రమ్తో మూవీ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.
కాగా త్రివిక్రమ్తో మూవీ అనంతరం మహేష్.. రాజమౌళితో సినిమా చేస్తారు. ఈ మూవీ 2023 ప్రథమార్థంలో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. దీనికి గాను రాజమౌళి తండ్రి విజేయంద్ర ప్రసాద్ ఇప్పటికే కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం మహేష్ మరోమారు వెకేషన్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వచ్చాక త్రివిక్రమ్తో మూవీని ప్రారంభించనున్నారు.
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…