Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన తీసిన గత నాలుగు చిత్రాలు వరుసగా హిట్ అయ్యాయి. భరత్ అనే నేను సినిమాతో మొదలు పెడితే.. మహర్షి, సరిలేరు నీకెవ్వరు, ఇప్పుడు సర్కారు వారి పాట.. మొత్తంగా 4 చిత్రాలు వరుసగా హిట్ అయ్యాయి. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఎంతో జోష్లో ఉన్నారు. ఇక ఆయన తరువాత సినిమా ఏమిటా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే మహేష్ తీసిన లాస్ట్ 4 చిత్రాలు అన్నీ సమాజానికి మెసేజ్ ఇచ్చేవే. దీంతో ఫ్యాన్స్ ఈసారి భిన్నమైన కథను ఎంచుకోవాలని కోరుతున్నారు. ఇక ఇప్పటికే ఆయన తన 28వ సినిమాను కూడా అనౌన్స్ చేసేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో, పూజా హెగ్డె హీరోయిన్ గా ఆయన సినిమా చేయనున్నారు. అయితే సర్కారు వారి పాటకు ఆయన రూ.50 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఈ క్రమంలోనే తన నెక్ట్స్ సినిమాకు ఆయన రూ.70 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో త్వరలోనే త్రివిక్రమ్తో మూవీ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.
కాగా త్రివిక్రమ్తో మూవీ అనంతరం మహేష్.. రాజమౌళితో సినిమా చేస్తారు. ఈ మూవీ 2023 ప్రథమార్థంలో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. దీనికి గాను రాజమౌళి తండ్రి విజేయంద్ర ప్రసాద్ ఇప్పటికే కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం మహేష్ మరోమారు వెకేషన్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వచ్చాక త్రివిక్రమ్తో మూవీని ప్రారంభించనున్నారు.
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…