OTT : వారం వారం మారుతున్న కొద్దీ ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు, సిరీస్లు రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఓటీటీలకు బాగానే అలవాటు పడ్డారు. దీంతో ఓటీటీ యాప్స్ వీలైనంత త్వరగా కొత్త సినిమాలను రిలీజ్ చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు సిద్ధమవుతున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రౌడీ హీరో విజయ్ దేవర కొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం.. హైవే. ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది. ఆహా ప్లాట్ఫామ్పై ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ నెల 19వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు.
కొత్త సినిమాలను విడుదలైన రోజే రిలీజ్ చేస్తున్న తమిళ రాకర్స్ అనే సైట్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇదే కథాంశం, ఇదే పేరుతో ఓ మూవీని తెరకెక్కించారు. తమిళ రాకర్జ్ పేరిట రూపొందిన ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. సోనీ లివ్ యాప్లో ఈ మూవీని ఈనెల 19వ తేదీన రిలీజ్ చేయనున్నారు. సినిమాల పైరసీ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు.
విజయ్ ఆంటోని నటించిన యానాయ్ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ మూవీని ఈ నెల 19వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. జీ5 యాప్లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది.
కన్నడ స్టార్స్ శివ రాజ్ కుమార్, ధనంజయలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ.. బైరాగి. ఈ మూవీని ఈ నెల 19వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. కన్నడలో తెరకెక్కిన ఈ మూవీ వూట్ అనే యాప్లో స్ట్రీమ్ కానుంది. ఇలా ఈ వారం పలు మూవీలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…