Lata Mangeshkar : గాన కోకిలగా పేరు పొందిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మనందరికీ దూరమయ్యారు. ముంబైలోని సిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. గత నెల రోజుల నుంచి ఆమె కరోనా కారణంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూశారు. కాగా లతా మంగేష్కర్ ప్రస్తుత వయస్సు 92 ఏళ్లు.
భారత దేశం గర్వించదగ్గ గాన కోకిల అయిన భారతరత్న లతా మంగేష్కర్ మృతి తీవ్ర విచారకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. ఆమె మరణం దేశానికి తీరని లోటు. సంగీత ప్రియులందరికీ ఆమె ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఆమె గొంతు 30 వేలకు పైగా పాటలు పాడింది. లతా దీదీ చాలా ప్రశాంత స్వభావం కలవారు. ప్రతిభతో కూడిన సంపన్నురాలు. దేశవాసులందరిలాగే లతా మంగేష్కర్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. నాకు సమయం దొరికినప్పుడల్లా ఆమె పాడిన పాటలను తప్పకుండా వింటాను. భగవంతుడు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలి. ఆమె కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటున్నాను. ఓం శాంతి.. అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్లు చేశారు.
కాగా కరోనా బారిన పడిన ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించిందని వైద్యులు తెలిపారు. ఆమె కొద్ది రోజులుగా వెంటిలేటర్పైనే చికిత్స తీసుకుంటున్నారని, ఆమెకు కోవిడ్ 19తోపాటు న్యుమోనియా కూడా సోకిందని.. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె కన్నుమూశారని.. వైద్యులు తెలిపారు. ఇక ఆమెకు డాక్టర్ ప్రతీత్ సమ్దానీ నేతృత్వంలోని వైద్యుల బృందం చికిత్సను అందించింది.
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…