Konidela Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ సతీమణి ఉపాసన ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆమె తాను చేసే పనులు, తన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, అప్డేట్స్తోపాటు.. తన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో ఫాలోవర్లతో పంచుకుంటారు. ఇక తాజాగా ఆమె ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఆమె ఇటీవల చోటు చేసుకున్న పలు సంఘటనల గురించి వివరించారు. తనకు కరోనా మహమ్మారి వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక ఉపాసన ఏం పోస్ట్ చేశారంటే..
తాను చెన్నైలోని తాత, అమ్మమ్మలను కలిసేందుకు వెళ్లానని.. అయితే స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించాయని.. దీంతో టెస్ట్ చేయించుకున్నానని.. కోవిడ్ పాజిటివ్ అని తేలిందని చెప్పారు. అయితే తాను ముందుగానే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నానని కనుక లక్షణాలు పెద్దగా లేవని అన్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే ఇలా స్వల్ప లక్షణాలతో కోవిడ్ నుంచి బయట పడవచ్చని తెలిపారు. ఇక తనకు వైద్యులు పారాసిటమాల్, విటమిన్ ట్యాబ్లెట్స్ను మాత్రమే ఇచ్చారని వివరించారు.
ఇక కోవిడ్ నుంచి తాను కోలుకున్నానని కూడా ఉపాసన తెలిపారు. తనకు నీరసం, జుట్టు రాలడం, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు రాలేదనిఅన్నారు. కరోనా తనపై పెద్దగా ప్రభావం చూపలేదని.. తాను మానసికంగా, భౌతికంగా దృఢంగా ఉన్నానని.. అందుకనే తనపై కోవిడ్ ప్రభావం చూపించలేదని తెలిపారు. ఇక తనకు వైద్యం అందించిన అపోలో హాస్పిటల్ డాక్టర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మళ్లీ వస్తుందా.. అంటే రాదు.. అని చెప్పలేం. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే.. అని ఉపాసన వివరించారు.
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు…