Konidela Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ సతీమణి ఉపాసన ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆమె తాను చేసే పనులు, తన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, అప్డేట్స్తోపాటు.. తన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో ఫాలోవర్లతో పంచుకుంటారు. ఇక తాజాగా ఆమె ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఆమె ఇటీవల చోటు చేసుకున్న పలు సంఘటనల గురించి వివరించారు. తనకు కరోనా మహమ్మారి వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక ఉపాసన ఏం పోస్ట్ చేశారంటే..
తాను చెన్నైలోని తాత, అమ్మమ్మలను కలిసేందుకు వెళ్లానని.. అయితే స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించాయని.. దీంతో టెస్ట్ చేయించుకున్నానని.. కోవిడ్ పాజిటివ్ అని తేలిందని చెప్పారు. అయితే తాను ముందుగానే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నానని కనుక లక్షణాలు పెద్దగా లేవని అన్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే ఇలా స్వల్ప లక్షణాలతో కోవిడ్ నుంచి బయట పడవచ్చని తెలిపారు. ఇక తనకు వైద్యులు పారాసిటమాల్, విటమిన్ ట్యాబ్లెట్స్ను మాత్రమే ఇచ్చారని వివరించారు.
ఇక కోవిడ్ నుంచి తాను కోలుకున్నానని కూడా ఉపాసన తెలిపారు. తనకు నీరసం, జుట్టు రాలడం, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు రాలేదనిఅన్నారు. కరోనా తనపై పెద్దగా ప్రభావం చూపలేదని.. తాను మానసికంగా, భౌతికంగా దృఢంగా ఉన్నానని.. అందుకనే తనపై కోవిడ్ ప్రభావం చూపించలేదని తెలిపారు. ఇక తనకు వైద్యం అందించిన అపోలో హాస్పిటల్ డాక్టర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మళ్లీ వస్తుందా.. అంటే రాదు.. అని చెప్పలేం. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే.. అని ఉపాసన వివరించారు.
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…