Kondapolam : ఉప్పెన మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇందులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ అద్భుతంగా నటించాడు. అందరి ప్రశంసలను ఈ మూవీ దక్కించుకుంది. ఇక వైష్ణవ్ తేజ్ నటించిన తాజా చిత్రం.. కొండపొలం. దీన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన నటిస్తోంది. అయితే ఈ మూవీ తాజాగా వివాదంలో ఇరుక్కుంది.
ఈ మూవీలో హీరో పేరుకు చివర యాదవ్ అని ఉంటుంది. దీనిపైనే వివాదం నెలకొంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్క్లబ్లో పాలమూరు కురవ సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ శంకరోళ్ల రవి కుమార్ మాట్లాడుతూ.. సినిమాలో హీరో పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
కొండపొలం సినిమాలో తమ కురుమ / కురువ కులవృత్తి ఎదుర్కొంటున్న సమస్యలను బాగా చూపించారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుందని అన్నారు. అయితే ఈ సినిమాలో హీరో పేరు కటారు రవీంద్ర యాదవ్ అని పెట్టారు. దాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
ఎందుకంటే.. యాదవులు అంటే గొర్రెలు, మేకలు కాకుండా గేదెలు, ఇతర పశువులను కూడా కాస్తారని, కానీ కురుమ, కురువలు గొర్రెలు మాత్రమే కాస్తారని అన్నారు. యాదవులు BC-Dలో కేటగిరీలో ఉండగా, కురుమలు ఇంకా వెనకబడిన వర్గానికి చెంది BC-B లో ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలోనే తమ పేరు చివర కురుమ అని పెట్టుకుంటామని, యాదవుల కుల దైవం మల్లన్న కాగా, తమ కుల దైవం బీరప్ప అని అన్నారు. ఇలా రెండు కులాలకు భిన్న అంశాలు ఉన్నాయని, అందువల్ల ఇది తమ అస్తిత్వాన్ని ప్రశ్నించేలా ఉందని అన్నారు.
కనుక హీరో పేరును మార్చాలని, యాదవ్ అనే పదాన్ని తొలగించినా తమకు అభ్యంతరం లేదని తెలిపారు. పేరు మార్చకుండా సినిమాను విడుదల చేస్తే ఆందోళనలు చేస్తాం అని హెచ్చరించారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…