Karthikeya 2 : టాలీవుడ్ లో గత రెండు వారాలుగా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. వరుసగా విడుదలవుతున్న చిత్రాలు హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఆగస్టు 5న విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతున్నాయి. ఇక ఇటీవల విడుదలైన మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2 సినిమాల్లో మాచర్ల నియోజకవర్గం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలవగా, కార్తికేయ 2 మాత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్ ను సంపాదించుకుంది.
మొదటి రోజు కాస్త తక్కువగానే కలెక్షన్లు వచ్చినా.. నాలుగవరోజుకి స్క్రీన్ కౌంట్ మూడింతలయింది. కంటెంట్ ఉంటే.. కలెక్షన్లకు అడ్డేదీ ఉండదని ఈ సినిమా నిరూపించింది. తెలుగులోనే కాకుండా.. ఇతర భాషల్లోనూ కార్తికేయ 2 భారీ వసూళ్లు రాబడుతోంది. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల విషయానికొస్తే.. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
కార్తికేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్ జీ5తో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. అతని మూవీ ది కాశ్మీర్ ఫైల్స్ కూడా జీ5లోనే స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు అభిషేక్ తాజాగా కార్తికేయ 2 ను కూడా జీ5 కే అమ్మినట్టు తెలుస్తోంది. సినిమా విడుదలైన ఆరు వారాలకు ఓటీటీలో విడుదల కానుంది. ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని జీ5 సంస్థ త్వరలోనే ప్రకటించనుంది. కార్తికేయ 2.. 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా వచ్చి బ్లాక్ బ్లాస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంతో నిఖిల్ కి బాలీవుడ్ లో మంచి గుర్తింపు లభిస్తోంది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…