Kamya Punjabi : బయటకు వెళ్లినప్పుడు మనం సహజంగానే కొన్ని సందర్భాల్లో ఫోన్లు లేదా పర్సులను మరిచిపోతుంటాం. దీంతో ఒక్కోసారి తీవ్ర నష్టం కలుగుతుంది. మనకు గుర్తుకు వచ్చి మన వస్తువులను మనం తీసుకుంటే ఓకే. లేదంటే మన వస్తువులు మనకు ఇక దొరకవు. ఒకసారి వస్తువులను మరిచాక తిరిగి వెళ్లి వెదికినా అవి కనిపించవు. ఒక వేళ కనిపిస్తే అది లక్ అని చెప్పవచ్చు. అవును.. సరిగ్గా ఆ నటికి కూడా ఇలాగే జరిగింది. అదృష్టం ఆమె పక్షాన ఉంది కాబట్టే రూ.1 లక్షను పోగొట్టుకున్నట్లే అయింది. కానీ మళ్లీ ఆమె డబ్బులు ఆమెకు దక్కాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
హిందీ నటి కామ్య పంజాబీ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు వెళ్లింది. అయితే అక్కడ ఉన్న ఓ ప్రముఖ పానీ పూరీ స్టాల్లో ఆమె పానీ పూరీలను టేస్ట్ చేసింది. దీంతో ఆమెతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే ఆ సందడిలో పడి ఆమె అక్కడ టేబుల్ మీద పెట్టిన రూ.1 నగదు ఉన్న ఓ కవర్ను మరిచిపోయింది. అక్కడి నుంచి వెళ్లిపోయింది.
అయితే తన దగ్గర ఉంచుకున్న రూ.1 లక్ష కనిపించడం లేదని తరువాత తెలిసింది. దీంతో ఆ కవర్ను అక్కడే వదిలేసినట్లు నిర్దారించుకుని వెంటనే తన మేనేజర్ను అక్కడికి పంపించి కవర్ తీసుకురావాలని చెప్పింది. డబ్బు ఉంది కనుక కవర్ అక్కడ ఉండదేమోనని.. అసలు ఆ లక్ష రూపాయలు మళ్లీ తన దగ్గరకు రావేమోనని ఆమె ఆందోళన చెందింది. కానీ ఆమె మేనేజర్ అక్కడికి వెళ్లి చూసే సరికి ఆ డబ్బులు ఉన్న కవర్ అక్కడే ఉంది. దీంతో మళ్లీ తన డబ్బు తన దగ్గరకు చేరింది. ఈ క్రమంలోనే ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. సాధారణంగా ఇలాంటి సంఘటనల్లో మనం పోగొట్టుకున్న డబ్బు మనకు వెనక్కి రాదు. ఎప్పుడో ఒక సారి లక్ బాగుంటేనే ఇలా జరుగుతుంది. ఇప్పుడు కామ్య పంజాబీకి కూడా ఇలాగే జరిగింది. దీంతో ఆమెకు లక్ బాగా ఉందని.. లేకపోతే డబ్బులు పోయి ఉండేవని.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…