సాధారణంగా రైల్వే స్టేషన్ లో రైలు దిగగానే ఎక్కడికి వెళ్లవలసిన ప్రయాణికులు అక్కడికి వెళ్తుంటారు. కానీ బీహార్ రైల్వే స్టేషన్ లో మాత్రం రైలు దిగగానే ప్రయాణికులు ఎక్కడ ఆగకుండా ఉన్నఫలంగా పరుగులు తీశారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందోనని కొంతవరకు ఆందోళన చెందారు. ప్రస్తుతం పలు రాష్ట్రాలలో కరోనా కేసులు అధికమవడంతో ఎక్కడ లాక్ డౌన్ విధిస్తారేమోనని వలస కూలీలు అందరు ముందుగానే తమ సొంతూళ్లకు బయలుదేరుతున్నారు.
వలస కూలీలు ఇతర రాష్ట్రాల నుంచి తరలిరావడంతో బీహార్ లో కూడా కరోనా కేసులు అధికంగా పెరిగాయి.అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీలతో రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి బీహార్ ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
బీహార్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్లో అధికారులు ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయడానికి సర్వం సిద్ధం చేశారు.దీంతో రైల్వే స్టేషన్ లో దిగిన ప్రయాణికులు ఎక్కడ తమకు కరోనా పరీక్షలు చేస్తే పాజిటివ్ గా నిర్ధారణ అయితే 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుందని ప్రయాణికులు రైలు దిగగానే ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…