సాధారణంగా రైల్వే స్టేషన్ లో రైలు దిగగానే ఎక్కడికి వెళ్లవలసిన ప్రయాణికులు అక్కడికి వెళ్తుంటారు. కానీ బీహార్ రైల్వే స్టేషన్ లో మాత్రం రైలు దిగగానే ప్రయాణికులు ఎక్కడ ఆగకుండా ఉన్నఫలంగా పరుగులు తీశారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందోనని కొంతవరకు ఆందోళన చెందారు. ప్రస్తుతం పలు రాష్ట్రాలలో కరోనా కేసులు అధికమవడంతో ఎక్కడ లాక్ డౌన్ విధిస్తారేమోనని వలస కూలీలు అందరు ముందుగానే తమ సొంతూళ్లకు బయలుదేరుతున్నారు.
వలస కూలీలు ఇతర రాష్ట్రాల నుంచి తరలిరావడంతో బీహార్ లో కూడా కరోనా కేసులు అధికంగా పెరిగాయి.అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీలతో రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి బీహార్ ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
బీహార్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్లో అధికారులు ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయడానికి సర్వం సిద్ధం చేశారు.దీంతో రైల్వే స్టేషన్ లో దిగిన ప్రయాణికులు ఎక్కడ తమకు కరోనా పరీక్షలు చేస్తే పాజిటివ్ గా నిర్ధారణ అయితే 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుందని ప్రయాణికులు రైలు దిగగానే ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…