గోవా సీఎం సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అర్థరాత్రి బీచ్ లో ఆడపిల్లలకు ఏం పని ఉంటుందని అన్నారు. ఆ రాష్ట్రంలో గత 5 రోజుల కిందట జరిగిన సామూహిక అత్యాచారం సంఘటన నేపథ్యంలో ఆయన అసెంబ్లీలో పై విధంగా మాట్లాడారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.
జూలై 24వ తేదీన గోవా రాజధాని పనాజీకి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్వా అనే బీచ్లో 10 మంది టీనేజర్లు పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో పార్టీ అయిపోయాక వారిలో 6 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు రాత్రంతా బీచ్లోనే ఉన్నారు. అయితే అదే సమయంలో అటు కొందరు యువకులు వచ్చి ఆ ఇద్దరు బాలురను గాయపరిచారు. అనంతరం ఆ బాలికలపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
అయినప్పటికీ ఆ రాష్ట్రంలో నిరసన సెగలు ఆగడం లేదు. ఆ సామూహిక అత్యాచారం ఘటన ఆ రాష్ట్ర సర్కారుకు ఇబ్బందిగా మారింది. అక్కడ ఈ సంఘటన తీవ్ర దుమారం రేపుతోంది. అసెంబ్లీలో సర్కారును విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
బాధితులకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీలోనూ చర్చ సాగించారు. అయితే చర్చ సందర్భంగా సీఎం సావంత్ మాట్లాడుతూ.. అసలు ఆడ పిల్లలను అర్థరాత్రి బయటకు ఎందుకు పంపించారు ? బీచ్ లో అంత రాత్రి పూట వారికి ఏం పని ? అని అన్నారు. అర్థరాత్రి పిల్లలు బయటకు వెళ్లారంటే అది తల్లిదండ్రుల బాధ్యతేనని, దీనిపై ప్రభుత్వం, పోలీసులను తప్పుబట్టడం సమర్థనీయం ఎలా అవుతుందని.. అన్నారు. దీంతోపై సావంత్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సీఎం ఆడపిల్లలను అవమానించేలా మాట్లాడారని, వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…