గోవా సీఎం సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అర్థరాత్రి బీచ్ లో ఆడపిల్లలకు ఏం పని ఉంటుందని అన్నారు. ఆ రాష్ట్రంలో గత 5 రోజుల కిందట జరిగిన సామూహిక అత్యాచారం సంఘటన నేపథ్యంలో ఆయన అసెంబ్లీలో పై విధంగా మాట్లాడారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.
జూలై 24వ తేదీన గోవా రాజధాని పనాజీకి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్వా అనే బీచ్లో 10 మంది టీనేజర్లు పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో పార్టీ అయిపోయాక వారిలో 6 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు రాత్రంతా బీచ్లోనే ఉన్నారు. అయితే అదే సమయంలో అటు కొందరు యువకులు వచ్చి ఆ ఇద్దరు బాలురను గాయపరిచారు. అనంతరం ఆ బాలికలపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
అయినప్పటికీ ఆ రాష్ట్రంలో నిరసన సెగలు ఆగడం లేదు. ఆ సామూహిక అత్యాచారం ఘటన ఆ రాష్ట్ర సర్కారుకు ఇబ్బందిగా మారింది. అక్కడ ఈ సంఘటన తీవ్ర దుమారం రేపుతోంది. అసెంబ్లీలో సర్కారును విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
బాధితులకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీలోనూ చర్చ సాగించారు. అయితే చర్చ సందర్భంగా సీఎం సావంత్ మాట్లాడుతూ.. అసలు ఆడ పిల్లలను అర్థరాత్రి బయటకు ఎందుకు పంపించారు ? బీచ్ లో అంత రాత్రి పూట వారికి ఏం పని ? అని అన్నారు. అర్థరాత్రి పిల్లలు బయటకు వెళ్లారంటే అది తల్లిదండ్రుల బాధ్యతేనని, దీనిపై ప్రభుత్వం, పోలీసులను తప్పుబట్టడం సమర్థనీయం ఎలా అవుతుందని.. అన్నారు. దీంతోపై సావంత్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సీఎం ఆడపిల్లలను అవమానించేలా మాట్లాడారని, వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…