IND Vs ENG : బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ విజయ దుందుభి మోగించింది. ఇంగ్లండ్పై 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో ఇంగ్లండ్ తడబడింది. పేకమేడలా ఆ జట్టు వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ విలవిల్లాడిపోయారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోయారు. దీంతో భారత్ ఇంగ్లండ్పై సునాయాసంగా విజయం సాధించింది. సిరీస్ను కైవసం చేసుకుని 2-0 ఆధిక్యంలో నిలిచింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో రవీంద్ర జడేజా, కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్లు రాణించారు. 29 బంతుల్లో జడేజా 5 ఫోర్లతో 46 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా.. రోహిత్ శర్మ 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. పంత్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్తో 26 పరుగులు చేశాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 4 వికెట్లు పడగొట్టగా రిచర్డ్ గ్లీసన్ 3 వికెట్లు తీశాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరంభం నుంచి తడబడింది. వరుసగా వికెట్లను కోల్పోతూనే వచ్చింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ 17 ఓవర్లలోనే 121 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో మొయిన్ అలీ (35 పరుగులు), డేవిడ్ విల్లీ (33 నాటౌట్) తప్ప మిగిలిన ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. కాగా భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు. జస్ప్రిత్ బుమ్రా, యజువేంద్ర చాహల్ చెరో 2 వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, హర్షల్ పటేల్లు చెరొక వికెట్ చొప్పున తీశారు. ఇక ఈ మ్యాచ్లో విజయంతో భారత్ ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకోగా.. ఈ సిరీస్లో చివరిదైన మూడో మ్యాచ్ ఆదివారం నాటింగామ్లో జరగనుంది.
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…