Bahubali Thali : సాధారణంగా మనం రెస్టారెంట్లకు వెళితే.. అక్కడ మనకు అనేక రకాల వంటకాలు లభిస్తాయి. అందులో భాగంగానే భోజన ప్రియుల అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల రెస్టారెంట్లు అనేక రకాల ఆహారాలను వండి వడ్డిస్తున్నాయి. అయితే ఈమధ్య కాలంలో రెస్టారెంట్లు భిన్న ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. ఒక భారీ భోజనం తయారు చేసి దాన్ని తింటే భారీ ప్రైజ్ మనీ ఇస్తామంటూ ఆఫర్లను అందిస్తున్నాయి. దీంతో చాలా మంది అలాంటి ఆఫర్లను ట్రై చేస్తున్నారు. కానీ ఫెయిల్ అవుతున్నారు. ఇక తాజాగా ఇంకో రెస్టారెంట్ కూడా ఇలాంటి ఆఫర్నే అందిస్తోంది. ఆ రెస్టారెంట్లో అందుబాటులో ఉన్న బాహుబలి భోజనాన్ని 30 నిమిషాల్లోగా పూర్తిగా తినాలి. దీంతో రూ.1 లక్ష సొంతమవుతుంది. ఇంతకీ ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉందంటే..
హైదరాబాద్లోని కేపీహెచ్బీలో ఉన్న నాయుడు గారి కుండ బిర్యానీ అనే రెస్టారెంట్లో తాజాగా ఓ ఆఫర్ను ప్రారంభించారు. అక్కడ అందుబాటులో ఉన్న ఓ భోజనాన్ని 30 నిమిషాల్లో పూర్తిగా తింటే రూ.1 లక్ష నగదు బహుమతి అందిస్తారు. దానికి బాహుబలి థాలి అని పేరు పెట్టారు. ఇక ఈ భోజనం ఖరీదు రూ.1800 కాగా దీన్ని 3 లేదా 4 మంది సులభంగా తినవచ్చు. కానీ ఆఫర్లో పాల్గొనాలంటే మాత్రం ఆ భోజనం మొత్తాన్ని ఒక్కరే తినాలి. అది కూడా ప్లేట్లో ఒక్క వంటకం కూడా మిగిల్చకుండా 30 నిమిషాల్లో మొత్తం తినేయాలి. అలా తింటే రూ.1 లక్ష గెలుచుకోవచ్చు.
ఇక ఈ ఆఫర్ను శుక్ర, శని, ఆదివారాల్లో అందుబాటులో ఉంచామని రెస్టారెంట్ నిర్వాహకులు తెలిపారు. ఈ భోజనంలో 30 రకాల వంటకాలు ఉంటాయి. చికెన్, మటన్, చేపలు, ప్రాన్స్ తదితర వెరైటీలతోపాటు స్వీట్లు, ఐస్క్రీమ్లు, బిర్యానీలు కూడా ఉంటాయి. అన్నింటినీ తినాల్సి ఉంటుంది. అయితే దీన్ని ఇప్పటి వరకు ఎవరూ ట్రై చేయలేదు. కావాలంటే ఎవరైనా ట్రై చేయవచ్చు. 30 నిమిషాల్లో రూ.1 లక్ష గెలుచుకోవచ్చు. ఇంకెందుకాలస్యం.. మీరు ఆ చాలెంజ్లో పాల్గొనదలిస్తే ఆ రెస్టారెంట్కు వెళ్లి రండి మరి..!
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…