Hyderabad : గత రెండు రోజుల కిందట హైదరాబాద్లోని మణికొండ నాలాలో గోపిశెట్టి రజనీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ గల్లంతైన విషయం విదితమే. అయితే రజనీకాంత్ మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. భారీ వర్షాల కారణంగా పొంగి పొర్లుతున్న నాలాలో పడ్డ రజనీకాంత్ కోసం రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో అతని మృతదేహం లభించింది.
మణికొండలో నివాసం ఉంటున్న గోపిశెట్టి రజనీకాంత్ షాద్ నగర్లోని నోవా గ్రీన్ అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. కాగా శనివారం రాత్రి 9 గంటలకు అతను ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అనంతరం మణికొండలోని గోల్డెన్ టెంపుల్ వద్ద అతను మ్యాన్ హోల్లో పడిపోయాడు. అక్కడ నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడ్డ రజనీకాంత్ గల్లంతయ్యాడు.
కాగా ఈ విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మణికొండ నుంచి నెక్నంపూర్ చెరువు వరకు గాలించారు. ఈ క్రమంలోనే నెక్నంపూర్ చెరువులో అతని మృతదేహం లభ్యమైంది. దీంతో అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…