Anjeer : ఒంట్లో నలతగా ఉన్నా.. జ్వరంతో బాధ పడుతున్నా అంజీరను తినమని సలహా ఇస్తారు. ఒత్తిడిని తగ్గించే అంజీర పండ్లకు వేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఐదు వేల సంవత్సరాల కిందటే అంజీర సాగు చేయడం మొదలైందట. ప్రస్తుతం ప్రపంచమంతటా అంజీర్ను పండిస్తున్నారు. వగరు, తీపి, పులుపు కలగలిసి ఉండే ఈ పండ్లను ఎండబెట్టగా తయారయ్యే అంజీర డ్రై ఫ్రూట్ ఏడాది పొడవునా మార్కెట్లలో దొరుకుతూనే ఉంటుంది. వీటిని తెలుగులో అత్తి పండ్లు అని కూడా పిలుస్తారు. ఈ పండ్లను ఎలా తిన్నా కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
ప్రధానంగా రెండు అంజీర్ పండ్లను నిత్యం భోజనానికి ముందు తింటే ఎన్నో లాభాలను పొందవచ్చు. అంజీర్ పండ్లను రెండింటిని తీసుకుని రాత్రి నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ నానిన అంజీర్ పండ్లను తింటూ ఆ నీటిని తాగాలి. ఇలా తినటం కష్టంగా ఉంటే నానిన అంజీర్ ని మెత్తని పేస్ట్ గా చేసుకొని తినవచ్చు. అంజీర్ పండ్లలో ఫైబర్ కావల్సినంత ఉంటుంది. దీంతో గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి జీర్ణ సంబంధ సమస్యలన్నీ దూరమవుతాయి. అంజీర్లో పొటాషియం, సోడియం బాగా లభిస్తాయి. ఇవి బీపీని కంట్రోల్లో ఉంచుతాయి.
నిత్యం రెండు అంజీర్ పండ్లను భోజనానికి ముందు తిన్నట్టయితే రక్తం బాగా పడుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి విష జ్వరాల బారిన పడి ప్లేట్లెట్లు తగ్గిన వారికి ఈ పండ్లను తినిపిస్తే వెంటనే ప్లేట్లెట్లు పెరుగుతాయి. అంజీర్ పండ్లను రెండు పూటలా భోజనానికి ముందు తింటే పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువగా ఆహారం తీసుకోలేము. ఫలితంగా బరువు కూడా తగ్గుతారు.
అంజీర్ పండ్లలో మెగ్నిషియం, మాంగనీస్, జింక్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి సంతానం కావాలనుకునే వారికి మేలు చేస్తాయి. అంజీర్ పండ్లు మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తాయి. భోజనానికి ముందు వీటిని తింటే అనంతరం రక్తంలో షుగర్ స్థాయిలు అంతగా పెరగవు. అంజీర్ పండ్లలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎముకలు దృఢమవుతాయి. కాబట్టి రోజుకి రెండు అంజీర్ పండ్లను తిని ఆరోగ్యంగా ఉండండి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…