Hanuman Mantra : హిందూ పురాణాల్లో హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన చిరంజీవి అని.. ఇప్పటికీ జీవించే ఉన్నాడని.. ఆయనకు మరణం లేదని.. ఆయన హిమాలయాల్లో కనిపించాడని.. అంటుంటారు. అయితే ఈ వార్తలు నిజమో కాదో తెలియదు కానీ.. హనమంతుడు మాత్రం చిరంజీవే. ఆయనకు మృత్యువు లేదు. రాదు. అందుకనే ఆయనకు పూజలు చేస్తే మృత్యు భయం ఉండదని. అన్ని రకాల భయాలు పోతాయని అంటుంటారు. అయితే ఆంజనేయ స్వామికి చెందిన ఓ మంత్రాన్ని రోజూ పఠిస్తే.. ఎలాంటి భయాలు ఉన్నా సరే పోతాయి. ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటే..
ఆంజనేయుడు మహా బలవంతుడు. భూత ప్రేత పిశాచాలను, దుష్ట శక్తులను తరిమి కొడతాడు. ఆయనను తలచుకుంటే అన్ని భయాలు పోతాయి. దుష్ట శక్తులు మన దగ్గర ఉండవు. మనల్ని బాధించవు. ఆయన మంత్రం పఠిస్తే అన్ని భయాల నుంచి విముక్తి పొందవచ్చు. సకల శుభాలు కలుగుతాయి. ఆయన మంత్రం ఇదే..
మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టం
వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామ దూతం శిరసానమామి
ఈ మంత్రానికి అర్థం ఇదే.. వాయువేగ మనో వేగాలతో ప్రయాణించగలవాడు, ఇంద్రియాలను జయించిన వాడు, బుద్ధిమంతుడు, అందరిలోకి ఉన్నతుడు, వాయుదేవుని పుత్రుడు. వానర యోధుల్లోకెల్లా ముఖ్యుడు, శ్రీరామ దూత అయిన ఆంజనేయుడికి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. కనుక ఈ మంత్రాన్ని రోజూ పఠిస్తే అన్నీ శుభాలే కలుగుతాయి. ముఖ్యంగా భయాలు ఉండవు. ఉదయం స్నానం చేశాక ఆంజనేయ స్వామి వద్ద బొట్టు పెట్టకుని ఈ మంత్రాన్ని పఠించాలి. ఎలాంటి భయాలు, బాధలు, ఆందోళనలు ఉండవు. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటారు. అనుకున్న పని పూర్తి చేస్తారు. సకల శుభాలు కలుగుతాయి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…