Aishwarya Rajinikanth : తమిళ స్టార్ సెలబ్రిటీ కపుల్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత 18 సంవత్సరాల క్రితం ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ జంట ఈ ఏడాది ఉన్నఫలంగా విడిపోతున్నామంటూ విడాకుల ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇలా భార్యాభర్తల బంధం నుంచి విడిపోయిన తర్వాత ఐశ్వర్య తిరిగి తన కెరీర్ పై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఐశ్వర్య మెగాఫోన్ చేత పట్టి ఓ మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేస్తూ బిజీ అయ్యింది. ఇలా ఎవరి కెరియర్ లో వారు బిజీగా ఉన్నప్పటికీ విడాకులు తీసుకుని విడిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం మాత్రం వెల్లడించలేదు. అదేవిధంగా విడాకుల గురించి ఎక్కడా ప్రస్తావించకుండా భార్య భర్తల బంధం నుంచి విడిపోయి స్నేహితులుగా ఉంటామని తెలియజేశారు.
విడాకుల అనంతరం ఈ జంట స్నేహితులుగా మారి ట్వీట్స్ చేసుకున్నారు. ఇలా వీరిద్దరి లేటేస్ట్ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్య రజినీకాంత్.. పయని అనే మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేయగా.. ఈ వీడియోని తమిళ వెర్షన్ లో రజనీకాంత్, తెలుగులో అల్లు అర్జున్, మలయాళంలో మోహన్ లాల్ విడుదల చేశారు. ఇక ఈ వీడియోపై ధనుష్ స్పందిస్తూ.. పయని మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేసిన నా స్నేహితురాలు ఐశ్వర్యకు అభినందనలు. గాడ్ బ్లెస్ యు.. అంటూ ధనుష్ పోస్ట్ పెట్టారు.
ఐశ్వర్య ఆయన ట్వీట్ కి స్పందిస్తూ థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చింది. ఈ విధంగా ఐశ్వర్య, ధనుష్ స్నేహితులుగా మారి ట్వీట్స్ చేసుకోవడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలోనే వీరి ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. విడాకుల తరువాత మొదటి సారిగా ఇలా సోషల్ మీడియా వేదికగా వీరు మాట్లాడుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…