BCCI : భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఆదివారం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో చివరి టీ20 మ్యాచ్ జరిగిన విషయం విదితమే. అయితే తొలి నాలుగు టీ20 మ్యాచ్లలో చెరో రెండు చొప్పున గెలిచిన ఈ జట్లు చివరి మ్యాచ్లో ట్రోఫీ కోసం తలపడ్డాయి. కానీ వరుణ దేవుడు ఆద్యంతం మ్యాచ్కు అడ్డంకిగా మారాడు. దీంతో మ్యాచ్ను రద్దు చేశారు. ఇరు జట్లకు ట్రోఫీని పంచారు. ఇరు జట్లను సిరీస్కు సంయుక్త విజేతలుగా ప్రకటించారు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడం.. దీంతో ఫ్యాన్స్ అసంతృప్తి చెందడం సహజమే. క్రికెట్ మ్యాచ్లు అన్నాక వర్షం పడ్డప్పుడు ఇలాగే జరుగుతుంటుంది. ఇది ఫ్యాన్స్కు అనుభవమే. కానీ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకు వచ్చిన ప్రేక్షకులకు మాత్రం ఊహించని షాక్ తగిలింది.
మ్యాచ్ సందర్భంగా వర్షం పడడంతో స్టేడియం పైకప్పు నుంచి నీరు లీకై కింద గ్యాలరీలో కూర్చున్న ప్రేక్షకుల మీద వర్షం పడింది. భారీ ఎత్తున నీరు లీకైంది. దీంతో స్టేడియంలో అసలు కూర్చోలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కొందరు ఫ్యాన్స్ ఈ సంఘటనకు చెందిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. బీసీసీఐని భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అలాగే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ను కూడా నిందిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా చెప్పుకునే బీసీసీఐ స్టేడియంలలో కనీస సదుపాయాలు కూడా కల్పించలేదా.. ఇంతకన్నా దారుణమైన వైఫల్యం మరొకటి ఉండదు.. ఇలాగైతే ఫ్యాన్స్ క్రికెట్ను ఎలా చూసి ఎంజాయ్ చేస్తారు.. ఇది చాలా దారుణమైన అనుభవం.. భారీ ఎత్తున నిధులు ఉన్నప్పటికీ దేశంలో స్టేడియంలలో పరిస్థితులు ఇలాగే ఉన్నాయని.. ఫ్యాన్స్కు మంచి క్రికెట్ వీక్షణ అనుభవం ఇవ్వాలన్న జ్ఞానం బీసీసీఐకి లేదని.. ఇకనైనా స్టేడియంలలో అద్భుతమైన క్రికెట్ వ్యూయింగ్ ఎక్స్పీరియెన్స్ వచ్చేలా సదుపాయాలను కల్పించాలని.. భారీ ఎత్తున స్టేడియంలలో మరమ్మత్తులు చేయాలని.. ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బీసీసీఐతోపాటు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ను కూడా క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
అయితే ఈ మధ్యే ఐపీఎల్ మీడియా రైట్స్ ద్వారా బీసీసీఐకి భారీగా ఆదాయం వచ్చింది. రూ.48,340 కోట్ల మేర ఆదాయం లభించింది. దీంతో ఆ మొత్తాన్ని దేశంలోని స్టేడియంలను అభివృద్ధి చేసేందుకు ఉపయోగిస్తామని.. అలాగే కొత్త స్టేడియంల నిర్మాణం కూడా చేపడుతామని.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. అయితే బెంగళూరు స్టేడియంలో పైకప్పు నుంచి వర్షం నీరు లీకైన వార్త, ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…