Chiranjeevi : రైల్వే బోగీలో రాఘ‌వేంద్ర‌రావు శోభనం గది ఏర్పాటు చేశాడ‌ని చెప్పిన చిరంజీవి..!

October 11, 2021 3:07 PM

Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, రాఘవేంద్రరావుల మధ్య ఎంతో ప్రత్యేకమైన ఆత్మీయత ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించారు. వీరి కాంబినేషన్ కూడా ప్రేక్షకులకు ఎంతో స్పెషల్. కేవలం ప్రొఫెషనల్ గా మాత్రమే కాకుండా పర్సనల్ గా కూడా వీరిద్దరూ మంచి ఆత్మీయులు. రాఘవేంద్రరావుని చిరంజీవి.. బాబాయ్ అని పిలుస్తారట. అలాగే చిరంజీవి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా రాఘవేంద్రరావు వస్తారు. రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో తెరకెక్కిన పెళ్ళి సందD సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.

Chiranjeevi told about his experience in train with surekha

ఆ వేదికపై రాఘవేంద్రరావుతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకుంటూ.. ఓ స్వీట్ షాక్ లాంటి సర్ ప్రైజ్ ను అందించారని అన్నారు. ఇంతకీ ఆ సర్ ప్రైజ్ ఏంటంటే.. చిరంజీవి పైళ్ళైన కొత్తలో మేటు పాళెం నుండి చెన్నై వచ్చే ట్రైన్ లో మెగాస్టార్, ఆయన భార్య సురేఖ ఎక్కారట. ఆ ట్రైన్ లో వారి కోసం ఓ కూపేని రాఘవేంద్రరావు బుక్ చేశారట. వెళ్ళి చూశాక.. అదొక అద్భుతమైన శోభనం గదిలా డిజైన్ చేసి ఉంచారని చిరు అన్నారు.

అంతేకాకుండా అక్కడ పళ్ళు, పూలు కూడా డెకరేట్ చేశారని.. అలా చూసి షాకయ్యాం అని, వాటితో పాటు మరెన్నో మెమరీస్ ని రాఘవేంద్రరావు ఇచ్చారని అన్నారు. కెరీర్ స్టార్టింగ్ లో మోసగాడు అనే సినిమాలో ఓ చిన్న పాత్ర చేశారు చిరంజీవి. ఆ తర్వాత రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ఎప్పటికైనా ఓ పూర్తి స్థాయి సినిమా తీయాలని అనుకున్నారట. ఆ కోరిక అడవి దొంగతో ఫుల్ ఫిల్ అయ్యింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించారని, అదంతా రాఘవేంద్రరావు వల్లే.. ఆ అదృష్టం దక్కిందని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now