Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారు. స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్గా ఎదిగారు. చిరంజీవి ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించారు. అలాగే కోట్ల ఆస్తులు కూడబెట్టారు. ప్రస్తుతం చిరంజీవి ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. ఇక చిరంజీవికి ఎన్నో చోట్ల ఆస్తులున్నాయి. చెన్నైలో ఎన్నో విలువైన భూములు, ఆస్తులను ప్రజారాజ్యం టైంలో అమ్మేశారని అంటుంటారు. అయినా చిరంజీవికి హైదరాబాద్లో చాలాచోట్ల ఖరీదైన భూములున్నాయి.
చిరు తన సంపాదనలో చాలా భాగం భూమి మీదే పెట్టారని అంటుంటారు. అయితే తాజాగా చిరు తన విలువైన ఓ ఆస్తిని అమ్మేసినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. హైదరాబాద్ ఫిలిం నగర్లో మెయిన్ రోడ్లో 3000 గజాల స్థలం ఉంది. అప్పట్లో దీన్ని ఆయన రూ.30 లక్షలకు కొనుగోలు చేశారని టాక్ ఉంది. ఇప్పుడు ఆ అత్యంత విలువైన స్థలాన్ని అమ్మేశారని తెలుస్తోంది. అంత విలువైన స్థలాన్ని చిరంజీవి అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ స్థలం అమ్మడానికి కారణం ఓ ప్రముఖ దినపత్రిక యజమాని ఎప్పటి నుంచో ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.
గత కొన్నేళ్లుగా ఆ దినపత్రికకు చెందినవారు ఈ మేరకు చిరును అడుగుతున్నారని సమాచారం. ఇక్కడ ఆయన ఆ దినపత్రిక ఛానల్ కార్యాలయం నిర్మిస్తారని అంటున్నారు. అయితే చిరు స్థలానికి అమ్మకం, కొనుగోలు రెండు పూర్తయినట్లు తెలుస్తుండగా సుమారు రూ.70 కోట్లకు కాస్త అటు ఇటుగా ఈ డీల్ కుదరిందని సమాచారం. ఫిలింనగర్లో గజం రెండు లక్షలకు పైగానే పలుకుతోంది. ఈ డీల్ రెండున్నర లక్షలకు కాస్త తక్కువగా జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి చిరు అంత తక్కువకు ఆ స్థలాన్ని అలా ఎందుకు అమ్మారనే చర్చ నడుస్తోంది. అయితే ఆచార్య కారణంగా వచ్చిన నష్టాలను భర్తీ చేసేందుకే ఆయన ఆ స్థలం అమ్మారని అంటున్నారు. ఇక ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విషయం తెలియాల్సి ఉంది.
ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం ఆచార్య తర్వాత మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళాశంకర్ సినిమాల్లో నటిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…