Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్గా ఎదిగాడు. చిరంజీవి ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించారు. కెరీర్ లో ఇంత సక్సెస్ చూసినా కోట్లమంది అభిమానులను సంపాదించుకున్నా కూడా ఆయన ఎన్నడూ ఒకరిని గట్టిగా విమర్శించడం, తిట్టడంలాంటివి చేయలేదు. ఇక మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎందరో కలలుగంటారు. ఇక హీరోయిన్ల సంగతి చెప్పక్కర్లేదు. అయితే చిరంజీవి లైఫ్ లో ఇద్దరు హీరోయిన్లు మాత్రం చిరుతో వింతగా ప్రవర్తించారట.
సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామరావు గారు నటి మాధవి గారి ప్రవర్తన గురించి ఆయన అనుభవాలను పంచుకున్నారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీ చిరంజీవికి ఒక మైలురాయి లాంటిది. ఇందులో హీరోయిన్ గా మాధవి గారు నటించారు. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన పున్నమినాగు కూడా సూపర్ హిట్. ఇప్పటికీ రగులుతోంది మొగలిపొద పాట వింటూనే ఉన్నాం.. అలాంటి ఈ హిట్ పెయిర్ కి చిన్నవివాదం ఉంది. నిజానికి చిరంజీవి గారు అప్పట్లో నటించిన హీరోయిన్స్ అందరితో ఇప్పటికీ తన స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఆయన మాధవిగారితో నటించడానికి చాలా ఇబ్బంది పడేవారట.
దీని కారణం ఆయనతో మాధవి గారు డిస్టెన్స్ మెయిన్ టైన్ చేయడమే. మాధవి గారు సినిమాల్లో నటించాలి.. అగ్రతారగా ఎదగాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి రాలేదట. ఇక ఇంట్లో వాళ్ళు కుడా సినిమాల్లో ఎవరితోనైనా చనువుగా ఉంటే వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, పెళ్లిలాంటివి ఇబ్బంది అవుతాయి అని ఆలోచించేవారట. అందువల్ల ఆమె సినిమా వాళ్లేవరితో ఎక్కువగా మాట్లాడేది కాదట. ఇక అలా చిరునే స్వయంగా.. నాతో మాట్లాడండి, క్లోజ్ గా ఉండండి సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ అపుడు ఇబ్బంది పడాల్సిన పని ఉండదు అంటూ చెప్పినా ఆమె దూరంగానే ఉండేవారట. దీంతో ఆమెతో నటించాలంటే నరకంగా ఉండేదని చిరంజీవి స్వయంగా చెప్పారని రామారావు గారు తెలిపారు.
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…