Chintha Chiguru : మనకు ఈ సీజన్లో ఎక్కడ చూసినా సరే చింత చిగురు అధికంగా లభిస్తుంది. దీన్ని చాలా మంది పప్పు లేదా పచ్చడి రూపంలో తయారు చేసుకుని తింటుంటారు. ఈ వంటకాలు ఎంతో రుచిగాఉంటాయి. అయితే కేవలం రుచిని మాత్రమే కాదు.. చింత చిగురు మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చింత చిగురులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్ గా వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా దగ్గు, జలుబు తగ్గుతాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
చింత చిగురులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే దీంట్లో ఉండే పోషకాల వల్ల పాలిచ్చే తల్లులు దీన్ని తింటే వారిలో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. మహిళలు దీన్ని తింటే నెలసరి సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి.
చింత చిగురులో యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవారికి మేలు జరుగుతుంది. చింత చిగురులో ఉండే విటమిన్ సి దంతాలను, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. చిగుళ్ల నుంచి అయ్యే రక్తస్రావం తగ్గుతుంది. నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది.
మలేరియా జ్వరం వచ్చిన వారు చింత చిగురు తింటే త్వరగా కోలుకుంటారు. అలాగే పచ్చకామెర్లకు, మధుమేహం ఉన్నవారికి కూడా ఇది మెడిసిన్లా పనిచేస్తుంది. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇక చింత చిగురును కాస్త తీసుకుని దంచి ముద్దలా చేసి కట్టు కడుతుంటే గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. ఇలా చింత చిగురు మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కనుక ఇది ఎక్కడ కనిపించినా అసలు విడిచిపెట్టకుండా తినాలి.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…