Chethana Raj : ప్రస్తుత తరుణంలో అందం పట్ల చాలా మంది ఎంత శ్రద్ధ వహిస్తున్నారో అందరికీ తెలిసిందే. అందంగా కనిపించేందుకు కేవలం స్త్రీలు మాత్రమే కాదు.. పురుషులు కూడా తాపత్రయ పడుతున్నారు. అందులో భాగంగానే బరువు తగ్గించే శస్త్ర చికిత్సలతోపాటు ముఖం ఇతర శరీర భాగాలు అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు. అయితే ఈ సర్జరీలు కుదిరితే బాగానే ఉంటాయి. కానీ కుదరకపోతే ముఖం లేదా శరీరం అంద విహీనంగా మారుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోతాయి కూడా. గతంలో కొందరు నటీనటులకు ఇలాగే జరిగింది. ఇక తాజాగా ఓ నటి కూడా ఇలాగే అందంగా కనిపించడం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. కానీ సర్జరీ వికటించి కొన్ని గంటల్లోనే మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..
కన్నడ టీవీ నటి చేతనా రాజ్ ఆ భాషలో పలు సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ నటించింది. ఈమె వయస్సు 21 ఏళ్లు. అయితే చేతనా చర్మం కింద ఉండే కొవ్వును కరిగించే ఫ్యాట్ ఫ్రీ కాస్మొటిక్ సర్జరీ చేయించుకుంది. అందుకుగాను ఆమె మే 16న బెంగళూరులోని శెట్టి సౌందర్య హాస్పిటల్లో చేరింది. దీంతో ఆమెకు వైద్యులు సర్జరీ చేశారు. అయితే సర్జరీ మధ్యాహ్నం జరగ్గా సాయంత్రం వరకు ఆమె ఊపిరితిత్తుల్లోకి బాగా నీరు చేరింది. దీంతో ఆమె అస్వస్థతకు గురైంది.
ఈ క్రమంలోనే సదరు హాస్పిటల్లో ఐసీయూ లేక ఆమెను సమీపంలోని మంజునాథ్ నగర్లో ఉన్న కడే హాస్పిటల్కు అత్యవసర చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రులు సదరు శెట్టి సౌందర్య హాస్పిటల్పై ఆరోపణలు చేస్తున్నారు. సరైన పరికరాలు లేకుండానే ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేశారని.. కనుకనే సర్జరీ వికటించి తమ కుమార్తె చనిపోయిందని వారు అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా…
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…