Naga Babu : మెగా బ్రదర్గా పేరుగాంచిన నాగబాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటుడిగా, నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేశారు. తన సినీ కెరీర్ను ఈయన 1986లో రాక్షసుడు సినిమాతో ప్రారంభించారు. తరువాత ఎన్నో సపోర్టింగ్ రోల్స్, నెగెటివ్ పాత్రలు చేశారు. తరువాత ఆయన నిర్మాతగా మారి తన తల్లి పేరిట అంజనా ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించి దాని ఆధ్వర్యంలో అనేక చిత్రాలను నిర్మించారు.
ఇక నాగబాబు 108 సినిమాలు చేయగా.. వాటిల్లో ఆయన నిర్మించిన చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లో చాలా సినిమాలు కమర్షియల్గా హిట్ సాధించాయి. తన సోదరులు చిరంజీవి, పవన్లతోనూ ఆయన నిర్మాతగా అనేక సినిమాలు తీశారు. ఇక మార్చి 2019లో నాగబాబు జనసేనలో చేరి నర్సాపూర్ పార్లమెంటరీ నియోజకర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో ఎన్నికల కమిషన్కు ఆయన ఎలక్షన్ అఫిడవిట్ను సమర్పించారు. దాని ప్రకారం ఆయన, ఆయన భార్య పేరిట మొత్తం కలిపి రూ.41 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. వాటిల్లో రూ.36.73 కోట్ల ఆస్తులు కేవలం విలువైన వాహనాల రూపంలోనే ఉన్నాయి. రూ.4.22 కోట్ల మేర ప్రాపర్టీస్ ఉండగా.. రూ.2.70 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు.
ఇక నాగబాబుకు లగ్జరీ కార్లు అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే ఆయన వద్ద ఆడి 6, ఆడి క్యూ7, బెంజ్ జీఎల్ఈ క్లాస్, ల్యాండ్ రోవర్ వంటి కంపెనీలకు చెందిన ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇక నాగబాబు ఒక సినిమాలో నటిస్తే ప్రస్తుతం రూ.25 లక్షలు తీసుకుంటున్నారు. అలాగే పలు టీవీ షోల్లోనూ ఈయన చేస్తున్నారు. జబర్దస్త్కు జడ్జిగా వ్యవహరించడం ద్వారా ఈయన బాగా పాపులర్ అయ్యారు. అయితే నా పేరు సూర్య పేరిట 2018లో నాగబాబు చివరిసారిగా నిర్మాతగా ఓ మూవీ తీశారు. కానీ ఆ మూవీ ఫ్లాప్ అయింది. దీంతో ఆయన మరింతగా అప్పుల్లో కూరుకుపోయారు. అయితే త్వరలోనే ఈయన మళ్లీ నిర్మాతగా మారనున్నారని తెలుస్తోంది. తన కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా ఈయన ఓ మూవీకి సహ నిర్మాతగా వ్యహరిస్తారని టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…