Black Pepper Water : మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ఎంతటి కీలకపాత్రను పోషిస్తుందో అందరికీ తెలిసిందే. రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా లేకపోతే మనకు అనేక వ్యాధులు వస్తాయి. అవి ఎప్పటికీ తగ్గవు. ముఖ్యంగా చలికాలంలో మనకు దగ్గు, జలుబు అధికంగా వస్తాయి. ఇలాంటి సమయంలో రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేయాలి. అప్పుడే మనకు వచ్చే సీజనల్ సమస్యలు తగ్గుతాయి. అయితే ఈ విషయాన్ని మాత్రం చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయరు. కానీ ఈ విషయంపై తప్పక దృష్టి సారించాలి. ఇక రోగ నిరోధక శక్తిని పెంచేందుకు మిరియాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో తయారు చేసే నీళ్లను ఈ సీజన్లో రోజూ తాగాలి. దీంతో దగ్గు, జలుబు వంటివే కాదు.. అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
మిరియాల నీళ్లను తాగడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా దగ్గు, జలుబు తగ్గుతాయి. అలాగే ఈ సీజన్లో బరువు తగ్గడం కష్టంగా ఉంటుంది. అలాంటి వారు మిరియాల నీళ్లను రోజూ తాగాలి. దీంతో తప్పక ఫలితం కనిపిస్తుంది. మిరియాలు మన శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతో బరువు తగ్గుతారు. ఈ నీళ్లను తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. అలాగే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాం. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. చర్మం పొడిబారకుండా ఉంటుంది. చలికాలంలో ఇది మనకు ఎంతగానో మేలు చేసే విషయం.
చలికాలంలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. దీంతో అజీర్ణం ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే గ్యాస్, కడుపునొప్పి, మలబద్దకం వంటి సమస్యలు కూడా ఈ సీజన్లోనే ఎక్కువగా వస్తుంటాయి. అలాంటప్పుడు మిరియాల నీళ్లను తాగితే తప్పక ఫలితం ఉంటుంది. మిరియాల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో దీన్ని ఎంతో కాలంగా ఉపయోగిస్తున్నారు. వంటల్లో కారంకు ప్రత్యామ్నాయంగా మిరియాల పొడిని వాడుకోవచ్చు. దీంతో రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ లభిస్తాయి. ఇక మిరియాల నీళ్లను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక పాత్రలో ఒకటిన్నర కప్పుల నీళ్లను తీసుకోవాలి. మిరియాలను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దంచి పొడి చేయాలి. ఈ పొడిని నీటిలో వేసి మరిగించాలి. నీళ్లు ఒక కప్పు అయ్యే వరకు సన్నని మంటపై మరిగించాలి. అనంతరం వడకట్టాలి. దీంతో మిరియాల నీళ్లు రెడీ అవుతాయి. అయితే ఇవి ఘాటుగా ఉన్నాయనుకుంటే రుచి కోసం కాస్త తేనె కలుపుకోవచ్చు. ఇలా మిరియాల నీళ్లను తయారు చేసి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన అనంతరం లేదా రాత్రి నిద్రకు ముందు ఒక కప్పు మోతాదులో తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు.
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని…
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…