Bimbisara : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం బింబిసార. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా బింబిసార నిలిచింది. కళ్యాణ్ రామ్ సహజ నటనకు.. డైరెక్టర్ వశిష్ట స్క్రీన్ ప్లే కు ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.
అయితే అదే రోజు దుల్కర్ సల్మాన్, మృణాల ఠాకూర్ ల సీతారామం కూడా విడుదలైంది. రష్మిక మందనా.. ఆఫ్రీన్ అనే కీ రోల్లో కనిపించింది. వీరి ప్రేమకథ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 1960లలో జరిగిన ఓ క్లాసికల్ లవ్ స్టోరీగా సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ విషయంలో కూడా సీతారామం దూసుకుపోయింది.
థియేటర్స్ లో అలరించిన ఈ రెండు చిత్రాలు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యాయి. బింబిసార ఓటీటీ హక్కులని జీ5.. సీతారామం హక్కులని అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలని సెప్టెంబర్ 9న ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9న ఈ రెండు చిత్రాలు 5 వారాల థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకోనున్నాయి. కాబట్టి తాజా నిబంధనల ప్రకారం ఓటీటీ రిలీజ్ కి అదే సరైన టైం అని మేకర్స్ భావిస్తున్నారు. కనుక అదే తేదీ రోజు ఈ మూవీలను ఆయా యాప్లు రిలీజ్ చేయాలని భావిస్తున్నాయి.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…