Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 చివరి కెప్టెన్సీ టాస్క్లో భాగంగా నియంత మాటే శాసనం అనే గేమ్ ఇవ్వగా ఇందులో చివరకు రవి, షణ్ముఖ్, ప్రియాంక మిగిలారు. అయితే చివరి బజర్కు నియంత స్థానాన్ని షణ్ముఖ్ దక్కించుకున్నాడు. ఇప్పుడు ప్రియాంక, రవిలలో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉండగా, తాను ట్రాన్స్ కమ్యూనిటీకి తను ఆదర్శంగా ఉండాలనుకుంటున్నానని, ఒక్కసారైనా కెప్టెన్ అవ్వాలని ఉందంటూ కోరింది.
గేమ్ నుండి తొలగించొద్దంటూ షణ్నుని బ్రతిమలాడింది. అయినా కూడా ఏ మాత్రం కరగని షణ్ను తను రవి కోసం ఏం చేయలేదంటూ ప్రియాంకని తొలగించి రవికి అవకాశం ఇచ్చాడు. ఈ గొడవతో ప్రియాంక తన చెంపలు వాయించుకుని వాష్రూమ్ హాల్లోకి వెళ్లి ఏడ్చేసింది. ఫైనల్గా షణ్ముఖ్, రవి కెప్టెన్సీ కంటెండర్లు అవగా శ్రీరామ్ తప్ప మిగతా అందరూ షణ్నుకు ఓటేయడంతో అతడు ఈ సీజన్లో ఆఖరి కెప్టెన్గా నిలిచాడు.
బీబీ ఎక్స్ప్రెస్ అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్లో చుక్ చుక్ సౌండ్ వచ్చినప్పుడల్లా కంటెస్టెంట్లంతా రైలు బోగీలా మారడంతోపాటు రైలులా కదలాల్సి ఉంటుంది. ఈ గేమ్లో అందరూ వినోదాన్ని పంచారు. అందరూ పాజ్లో(ఆగిపోయి) ఉన్నప్పుడు కాజల్ భర్త, కూతురు హౌస్లోకి వచ్చారు. తల్లిని చూడగానే కాజల్ కూతురు గుక్కపెట్టి ఏడ్చింది. కాజల్ను రిలీజ్ అని చెప్పగానే ఆమె తన ఫ్యామిలీని పట్టుకుని ఎమోషనల్ అయింది.
గెలవకపోయినా కనీసం టాప్ 5కి చేరుకున్నా సంతోషమే అని చెప్పింది కూతురు. మమ్మీనెవరైనా నామినేట్ చేస్తే కోపమొస్తుందా ? అని శ్రీరామ్ అడగ్గా కాజల్ కూతురు అవునని తలూపింది. రవి, శ్రీరామ్ను రెండుసార్లు, అనీ మాస్టర్నైతే లెక్కలేనన్నిసార్లు తిట్టుకున్నానంది. అనీ మాస్టర్ ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉన్నానంటూనే జస్ట్ జోక్ చేశానని కవర్ చేసింది. మొత్తానికి కాజల్ కూతురు ఉన్నంత సేపు హౌజ్లో తెగ సందడి చేసి వెళ్లిపోయింది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…