Bhanu Priya : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు తమ అందం, అభినయం, టాలెంట్ తో సక్సెస్ ని సాధించారు. ఇంకా సాధిస్తూనే ఉన్నారు. అయితే వీరిలో కొంతమందికి మాత్రం ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. సీనియర్ యాక్టర్స్ లో ఒకప్పటి హీరోయిన్ భానుప్రియ.. తన అందం, అభినయంతో సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది పేరును సంపాదించుకున్నారు.
తెలుగులో ఆమె నటించిన సినిమాలంటే ఎంతో మందికి అభిమానం. ముఖ్యంగా స్వర్ణకమలం సినిమాలో భానుప్రియ యాక్టింగ్ అద్భుతం అని చెప్పుకోవచ్చు. అమాయకత్వం, అందం, తెలివితేటలు, అద్భుతమైన కళ ఇవన్నీ కలగలిపితే భానుప్రియ. ఈమె డాన్స్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవ్వకుండా ఉండలేరు. అలాంటి ఉత్తమమైన నటి కెరీర్ ను ఓ నిర్మాత నాశనం చేశారు.
భానుప్రియ అందాన్ని చూసి ఆ నిర్మాత తన సొంత బ్యానర్ లో ఆమెతో కలిసి ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ నిర్మాత దుర్బుద్దిని తెలుసుకున్న హీరోయిన్ భానుప్రియ మాత్రం అతని బ్యానర్లో సినిమా చేసేందుకు ఒప్పుకోలేదట. దీంతో ఆ నిర్మాత భానుప్రియపై, ఆమె కెరీర్ పై కోపం పెంచుకున్నారు. అందుకే ఆమె కెరీర్ ను ఎలాగైనా సరే నాశనం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి, అతనికి ఉన్న పలుకుబడిని ఉపయోగించి భానుప్రియకు హీరోయిన్ గా ఎలాంటి అవకాశాలు రాకుండా మానసికంగా కృంగిపోయేలా చేశారు.
ఇప్పటికీ కూడా ఆ నిర్మాతకు ఎంతో పేరుందని భానుప్రియ అన్నారు. నిజానికి ఆ నిర్మాత కనుసైగల్లోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఉందని చెప్పినా ఆశ్చర్యం లేదని అన్నారు. అలా భానుప్రియ.. ఆ నిర్మాత అనుకున్నట్లుగా తన సొంత బ్యానర్ లో సినిమా చేయలేదనే కారణంతోనే.. ఆమెకు ఎలాంటి సినిమా అవకాశాలు రాకుండా చేశారని, తన ఎంటైర్ కెరీర్ ను నాశనం చేశారని అన్నారు. అయితే సీనియర్ యాక్టర్ గా, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చినా సరే ఆమెకు సరైన గుర్తింపు ఉన్న పాత్రలు రావడం లేదు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…