Beast Movie : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డె ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం బీస్ట్.. ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా నచ్చలేదని విజయ్ ఫ్యాన్స్ ఏకంగా ఓ థియేటర్లో స్క్రీన్కి నిప్పు పెట్టారు. అయితే సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లలో మాత్రం దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ అప్డేట్ కూడా వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్, సన్ నెక్ట్స్ ఈ చిత్రాన్ని మే 11 నుండి తమ ఫ్లాట్ ఫాంలలో స్ట్రీమింగ్ చేయనున్నాయి.
కాగా.. బీస్ట్ ఉగ్రవాద నేపథ్యంలో సాగే సినిమా. ఓ మాల్ను ఉగ్రవాదులు హైజాక్ చేసిన సమయంలో.. అందులోనే ఉన్న హీరో విజయ్.. అక్కడి జనాలను ఎలా రక్షించాడనేదే కథ. విజయ్ నటన ఆకుట్టుకున్నప్పటికీ.. కథ, కథనాలు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవలేదు. ఫస్టాఫ్ కొంత ఫర్వాలేదు అనిపించినా.. సెకండాఫ్ మాత్రం బోర్ కొట్టించిందని సినిమా చూసిన జనాలు అభిప్రాయపడుతున్నారు. బీస్ట్ నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో విజయ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.
అయితే బీస్ట్ చిత్రం మాత్రం కోలీవుడ్లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. రెండు రోజుల్లోనే రూ.వంద కోట్లు రాబట్టింది. మూడు రోజుల్లోనే రూ.150 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. అయితే ఈ చిత్రం మిగతా అన్ని చోట్లా డిజాస్టర్గా మిగిలే అవకాశం ఉంది. పాన్ ఇండియా అంటూ అన్ని భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేశారు. మరీ ముఖ్యంగా నార్త్లో ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది. ఇక సినిమా నెగెటివ్ టాక్ ను తెచ్చుకోవడంతోపాటు.. కేజీయఫ్ చాప్టర్ 2 ప్రభంజనం ముందు కూడా వెలవెలబోయింది. బీస్ట్ కలెక్షన్లు ఘోరాతిఘోరంగా ఉన్నాయి. తమిళనాడులో సైతం విజయ్కి గట్టిపోటినిస్తూ యష్ వసూళ్లను రాబట్టాడు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…