Bandla Ganesh : టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం లైగర్. ఫస్ట్ డేనే మూవీ ఆడియెన్స్ అంచనాలను రీచ్ కాలేకపోయింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3000 థియేటర్లలో రిలీజ్ అయిన చిత్రం తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రమ్యకృష్ణ, విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్ తప్ప.. సినిమాలో ఎలాంటి ఎగ్జైట్ మెంట్ లేదని, పూరీ మార్క్ అసలే లేదని ఆడియెన్స్ అంటున్నారు. పూరీ ఇంతలా డిజపాయింట్ చేస్తారని ఊహించలేదని ఫ్యాన్స్ కూడా తెగ ఫీల్ అవుతున్నారు. పూరీ కెరీర్లో లైగర్ డిజాస్టర్ మూవీగా మిగిలిపోయింది.
ఇడియట్, పోకిరి లాంటి మాస్ మూవీస్ తీసిన పూరీ ఇతనేనా అని ట్రోల్ చేస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయితే అయ్యింది కానీ ప్రమోషన్స్ లో పూరీ బ్యాచ్ చేసిన అతి వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో వీరిని ఏకిపారేస్తున్నారు. విజయ్, ఛార్మి, పూరీ ఇలా ఎవరిని వదలకుండా ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఇంకొందరైతే పూరీ జగన్నాథ్ గతంలో చేసిన తప్పులను బయటకు తవ్వుతున్నారు. ఆ పాపమే నీ పాలిట శాపంగా మారింది అంటూ పుండు మీద కారం చల్లినట్టు ఇంకా రెచ్చగొడుతున్నారు. వాటిల్లో బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఆ మధ్య పూరీ కొడుకు ఆకాష్ పూరీ చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. జీవితంలో వ్యాంపులు వస్తుంటారు పోతుంటారు అన్నా.. కానీ వదినమ్మ నీకు శాశ్వతం.. నీకోసం వదినమ్మ పడిన బాధలు ఎన్నో నాకు తెలుసు. నీ కొడుకు ఫంక్షన్ కి రాలేనంత బిజీ అయిపోయావా నువ్వు ? ఆకాష్ అంటే సన్నాఫ్ పూరీ జగన్నాథ్ అంతే.. వేరే పేరు రాస్తే తంతారు. పవిత్రను, ఆకాష్ ను బాగా సెటిల్ చెయ్యి అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు బండ్ల గణేష్.
పూరీ జగన్నాథ్ భార్యను గతంలో ఏడిపించాడు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఆనాడు పడిన బాధలు ఈనాడు ఛార్మి, పూరీ పాలిట శాపంగా మారాయని.. లైగర్ సినిమా డిజాస్టర్ టాక్ తో అప్పుల్లో కూరుకుపోయేలా చేశాయని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై కొందరు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే.. మరికొందరు.. అసలే సినిమా ఫ్లాప్ అయిన బాధలో ఉన్నాడు.. మీరు ఇంకా బాధ పెట్టకండ్రా బాబు.. అంటూ కూల్ చేస్తున్నారు.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…