Vijay Sethupathi : కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ ఉన్న హీరో విజయ్ సేతుపతి. ఈయనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో వెనుక నుండి ఓ వ్యక్తి వచ్చి తన్నినట్లుగా ఈ వీడియోలో ఉంది. అయితే ఈ విషయాన్ని పెద్దది చేయకండి అని విజయ్ సేతుపతి వదిలేశారు. ఆ ప్రాబ్లెమ్ ని సాల్వ్ చేసి.. ఆ ప్రయాణికుడికి, విజయ్ అసిస్టెంట్ కి మధ్య గొడవ సాల్వ్ అయినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో చాలా వరకు వైరల్ అయ్యి.. పెద్ద వివాదానికి దారి తీసింది. హిందూ మతతత్వ సంస్థ ఇచ్చిన లేటెస్ట్ స్టేట్ మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హిందూ మక్కల్ కట్చి అనే ఆర్గనైజేషన్ విజయ్ సేతుపతిని కొట్టిన వారికి 1001 రూపాయలు గిఫ్ట్ గా ఇస్తామంటూ ప్రకటించారు.
ఎందుకంటే స్వాతంత్య్ర సమరయోధులైన దైవతిరు పసుంపోన్ ముత్తు రామలింగ తేవర్ అయ్యను, ఇంకా దేశాన్ని అవమానించేలా మాట్లాడారని అన్నారు. అలాగే వీటికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ ని కూడా పోస్ట్ చేశారు. ఈ వివాదంపై హిందూ మక్కల్ కట్చి సంస్థకు సంబంధించిన వ్యక్తి అర్జున్ సంపత్ మాట్లాడుతూ.. తాను ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చిన మాట వాస్తవమేనని.. అయితే విజయ్ సేతుపతిని తన్నేందుకు ప్రయత్నించిన వ్యక్తి అయిన మహాగాంధీతో మాట్లాడానని, విజయ్ సేతుపతి ఆ వ్యక్తితో చాలా హేళనగా మాట్లాడటం వల్లే ఆ వ్యక్తి గొడవ పడినట్లు తెలిపారు. విజయ్ కు జాతీయ అవార్డ్ వచ్చినందుకు ఆ వ్యక్తి విష్ చేయాలని అనుకుంటే.. విజయ్ సేతుపతి చాలా వెటకారంగా స్పందించారని, అసలు ఇది దేశం కాదన్నారని అన్నారు.
మీరు సౌత్ నుండి వచ్చారని, పసుంపోన్ కు అటెండ్ అవ్వాలని.. ప్రపంచానికి ఒకే ఒక దైవం జీసస్ మాత్రమేనంటూ విజయ్ సేతుపతి ఆ వ్యక్తితో అన్నాడని, అందుకే మహాగాంధీ అలా రియాక్ట్ అయినట్లుగా అర్జున్ సంపత్ తెలిపారు. ఈ విషయంపై ఆ వ్యక్తికి నగదు బహుమతి ప్రకటించానని అన్నారు. ఇక ఈ విషయంలో విజయ్ సేతుపతి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హిందూ మక్కల్ కట్చి సంస్థపై, అర్జున్ సంపత్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. తమ ఫేవరెట్ అభిమానిపై ఇలా ఆరోపణలు చేయడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…