Vijay Sethupathi : కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ ఉన్న హీరో విజయ్ సేతుపతి. ఈయనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో వెనుక నుండి ఓ వ్యక్తి వచ్చి తన్నినట్లుగా ఈ వీడియోలో ఉంది. అయితే ఈ విషయాన్ని పెద్దది చేయకండి అని విజయ్ సేతుపతి వదిలేశారు. ఆ ప్రాబ్లెమ్ ని సాల్వ్ చేసి.. ఆ ప్రయాణికుడికి, విజయ్ అసిస్టెంట్ కి మధ్య గొడవ సాల్వ్ అయినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో చాలా వరకు వైరల్ అయ్యి.. పెద్ద వివాదానికి దారి తీసింది. హిందూ మతతత్వ సంస్థ ఇచ్చిన లేటెస్ట్ స్టేట్ మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హిందూ మక్కల్ కట్చి అనే ఆర్గనైజేషన్ విజయ్ సేతుపతిని కొట్టిన వారికి 1001 రూపాయలు గిఫ్ట్ గా ఇస్తామంటూ ప్రకటించారు.
ఎందుకంటే స్వాతంత్య్ర సమరయోధులైన దైవతిరు పసుంపోన్ ముత్తు రామలింగ తేవర్ అయ్యను, ఇంకా దేశాన్ని అవమానించేలా మాట్లాడారని అన్నారు. అలాగే వీటికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ ని కూడా పోస్ట్ చేశారు. ఈ వివాదంపై హిందూ మక్కల్ కట్చి సంస్థకు సంబంధించిన వ్యక్తి అర్జున్ సంపత్ మాట్లాడుతూ.. తాను ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చిన మాట వాస్తవమేనని.. అయితే విజయ్ సేతుపతిని తన్నేందుకు ప్రయత్నించిన వ్యక్తి అయిన మహాగాంధీతో మాట్లాడానని, విజయ్ సేతుపతి ఆ వ్యక్తితో చాలా హేళనగా మాట్లాడటం వల్లే ఆ వ్యక్తి గొడవ పడినట్లు తెలిపారు. విజయ్ కు జాతీయ అవార్డ్ వచ్చినందుకు ఆ వ్యక్తి విష్ చేయాలని అనుకుంటే.. విజయ్ సేతుపతి చాలా వెటకారంగా స్పందించారని, అసలు ఇది దేశం కాదన్నారని అన్నారు.
మీరు సౌత్ నుండి వచ్చారని, పసుంపోన్ కు అటెండ్ అవ్వాలని.. ప్రపంచానికి ఒకే ఒక దైవం జీసస్ మాత్రమేనంటూ విజయ్ సేతుపతి ఆ వ్యక్తితో అన్నాడని, అందుకే మహాగాంధీ అలా రియాక్ట్ అయినట్లుగా అర్జున్ సంపత్ తెలిపారు. ఈ విషయంపై ఆ వ్యక్తికి నగదు బహుమతి ప్రకటించానని అన్నారు. ఇక ఈ విషయంలో విజయ్ సేతుపతి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హిందూ మక్కల్ కట్చి సంస్థపై, అర్జున్ సంపత్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. తమ ఫేవరెట్ అభిమానిపై ఇలా ఆరోపణలు చేయడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…