విజయవాడలోని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొనే భక్తులకు ఆలయ కమిటీ పలు ముఖ్య ఆదేశాలను జారీ చేసింది.కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నేటి నుంచే అమ్మవారి ఆలయంలో ఆంక్షలు విధిస్తున్నట్లు పాలకమండలి ఛైర్మన్, ఈవో, ఇతర వైదిక కమిటీ సభ్యులు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే ఆలయంలో పనిచేసే దాదాపు 45 మంది సిబ్బంది కరోనా బారిన పడగా, ఆలయ అర్చకులు మరణించడంతో ఆలయ కమిటీ పటిష్టమైన చర్యలు చేపట్టనుంది.
మంగళవారం ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30 వరకే అమ్మవారి దర్శనం కల్పిస్తారు. రాత్రి ఏడు తర్వాత ఘాట్రోడ్డు, మహామండపం, మెట్ల మార్గాలను మూసివేయనున్నారు. అమ్మవారికి జరిగే ఏకాంత పూజలను యధావిధిగా నిర్వహించనున్నారు.
ఆలయాన్ని సందర్శించే భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. మాస్క్ లేనిపక్షంలో 200 జరిమానా విధించనున్నారు. దర్శనానికి వెళ్ళే భక్తులు ఆరు అడుగుల బౌతిక దూరం పాటించాలి. అదేవిధంగా ప్రతి గంటకు ఒకసారి క్యూలైన్లను సోడియం హైపోక్లోరైడ్తో శానిటైజ్ చేయాలని నిర్ణయించారు. ఆలయ ఆవరణలోని వసతి గృహాలు మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. భక్తులకు టెంపరేచర్ పరిశీలించిన తర్వాతే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. అదేవిధంగా భక్తులు గుంపులుగా చేరకుండా భౌతిక దూరం పాటించే విధంగా అన్ని జాగ్రత్తలను చేపట్టినట్లు ఆలయ కమిటీ తెలియజేసింది.
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…