Anasuya : ఓ వైపు బుల్లితెరపై పలు టీవీ షోలు, ఈవెంట్లు చేస్తూనే.. మరోవైపు వెండితెరపై కూడా అనసూయ చాలా బిజీగా మారింది. ఈ మధ్య కాలంలో ఈమె అనేక సినిమాల్లో వరుసగా నటిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో ఈమె దాక్షాయణిగా పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించి మెప్పించింది. అలాగే రవితేజ ఖిలాడి సినిమాలోనూ గ్లామరస్ పాత్రలో కనిపించి అనసూయ అలరించింది. అయితే తాజాగా ఇంకో పాత్ర ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈమె సిద్ధమవుతోంది.
అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం.. దర్జా. డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ మూవీ విడుదల కాబోతోంది. దీన్ని సలీమ్ మాలిక్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో అనసూయ కనక మహాలక్ష్మి పాత్రలో నటిస్తోంది. కాగా ఈ మూవీకి చెందిన టీజర్ను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు లాంచ్ చేశారు. ఒక నిమిషం 11 సెకన్ల నిడివిగల ఈ టీజర్లో అనసూయ చాలా పవర్ఫుల్ డైలాగ్స్ చెబుతూ కనిపించింది. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి.
ఇక ఈ టీజర్లో అనసూయ పలు పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పడం చూడవచ్చు. ఎవరైనా ఈ కనకాన్ని టచ్ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది.. అనే స్ట్రాంగ్ డైలాగ్ను అనసూయ చెప్పింది. అలాగే.. నేను చీరకట్టిన శివాంగిని రా.. నేను వేటాడితే ఎలా ఉంటుందో వాడికి తెలియాలి.. అని కూడా ఆమె డైలాగ్ చెప్పింది. దీంతో ఈ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో సునీల్ మరో కీలకపాత్రలో నటించాడు. కామినేని శ్రీనివాస్ సమర్పణలో శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేయనున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…