Allu Arjun : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైలే వేరు. గంగోత్రి చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమై ఇతను హీరోనా అనే రేంజ్ నుంచి హీరో అంటే ఇలా ఉండాలి అనే రేంజ్ కి ఎదిగాడు అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీలో ఎంతమంది హీరోలు ఉన్నా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే యూత్ లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది. సుకుమార్ దర్శకత్వంలో ఆర్య చిత్రంతో యువత మనసులను కొల్లగొట్టాడు అల్లు అర్జున్.
ఆ తరువాత బద్రీనాథ్, దేశముదురు, జులాయి వంటి చిత్రాలతో రేసుగుర్రంలా దూసుకుపోతూ అగ్రస్థాయి హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలాంటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏం చేసినా స్టైలిష్ గానే ఉంటుంది. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప చిత్రంతో దేశ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. పుష్ప రాజ్ తగ్గేదేలే అంటూ దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాడు.
కెరీర్ లో ఫుల్ సక్సెస్ తో దూసుకుపోతున్న టైంలోనే అల్లు అర్జున్.. స్నేహ రెడ్డి ని 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదటి చూపుతోనే స్నేహ రెడ్డితో ప్రేమలో పడిపోయిన అల్లు అర్జున్ ఇంటర్ క్యాస్ట్ కావడంతో ఇంట్లో తండ్రి అరవింద్ ను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అల్లు అర్జున్ రేంజ్ కి తగ్గట్టు స్నేహ రెడ్డి కూడా ఎంతో అందంగా హీరోయిన్లను తలదన్నే విధంగా ఉంటుంది. ఆమెను చూసిన బన్నీ తల్లి పెళ్లికి ముందు స్నేహారెడ్డికి కొన్ని కండిషన్స్ పెట్టింది అని వార్తలు వైరల్ గా మారాయి.
ఇంతకీ స్నేహ రెడ్డికి బన్నీ తల్లి పెట్టిన కండిషన్స్ ఏంటంటే.. మొదటి నుంచి చలాకీ అయిన స్నేహను చూసి.. పెళ్లి అయిన తర్వాత మా అబ్బాయిని ఎంతో ప్రేమగా చూసుకోవాలి. గ్లామర్ పాడైపోతుందని పిల్లలను కనడం ఆలస్యం చేయకూడదు. పెళ్లైన మొదటి ఏడాదిలోనే నా చేతిలో మనవడినో, మనవరాలి నువ్వు కచ్చితంగా పెట్టాలి అంటూ స్నేహా రెడ్డికి కండిషన్ పెట్టిందట అత్తగారు. ఇక స్నేహ కండిషన్స్ అన్ని ఒప్పుకోవడంతో ఎంతో గ్రాండ్ గా అల్లు అర్జున్ స్నేహ రెడ్డి వివాహం జరిగింది. స్నేహా రెడ్డి కూడా అత్త గారికి ఇచ్చిన మాట తప్పకుండా మొదటిగా కొడుకు అయాన్ ని, తర్వాత కూతురు అర్హ జన్మనిచ్చి అత్తగారి కోరికను నెరవేర్చింది.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…