Adivi Sesh Major : కరోనా వైరస్ మూడో వేవ్ కారణంగా ఇప్పటికే అనేక చిత్రాలు పోస్ట్పోన్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆ జాబితాలోకి తాజాగా అడివి శేష్ నటించిన మేజర్ వచ్చి చేరింది. కరోనా కారణంగా ఈ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట చిత్రాలు వాయిదా పడ్డాయి. కాగా మేజర్ సినిమాకు గాను త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ప్రస్తుత తరుణంలో దేశంలో చాలా చోట్ల కోవిడ్ ఆంక్షలు, కఠిన నియమాలు ఉన్నాయి. అందువల్ల మేజర్ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. మేజర్ సినిమాను భారతీయ సినీ ప్రేక్షకుల కోసం తీశాం. అందువల్ల దేశంలో పరిస్థితులు చక్కబడ్డాకే మూవీని విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. కనుక అప్పటి వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. కరోనా నుంచి సురక్షితంగా ఉండండి.. అంటూ చిత్ర యూనిట్ ఒక ప్రకటనను విడుదల చేసింది.
కాగా మేజర్ మూవీని పలు యదార్థ సంఘటనల ఆధారంగా చిత్రీకరిస్తున్నారు. 2008లో ముంబై దాడుల్లో ఆత్మత్యాగం చేసిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అడివి శేష్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. శశి కిరణ్ తిక్క ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, ఏప్లస్ఎస్ మూవీస్ సంస్థలు సహ నిర్మాణ బాధ్యతలను వహిస్తున్నాయి. ఇక త్వరలోనూ ఈ మూవీ విడుదలకు సంబంధించి కొత్త తేదీని ప్రకటించనున్నారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…