Acharya : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఆచార్య సందడి నెలకొంది. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి నటించిన సినిమా కావడంతో థియేటర్స్కి క్యూ కడుతున్నారు. ఏ థియేటర్ వద్ద చూసినా మెగా అభిమానుల సందడే కనిపిస్తోంది. మూడేళ్ల తర్వాత చిరు సినిమా రావడం.. అది కూడా అనేక వాయిదాల అనంతరం విడుదల కావడంతో.. ఆచార్య సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. అయితే ఈ సినిమాపై సోషల్ మీడయాలో తెగ ట్రోలింగ్ నడుస్తోంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు.
తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఘటికుడు సినిమా గుర్తుందా ? అందులో ఆ చిత్ర బృందం ఒక ప్రయోగం చేసింది. సూర్య చిన్నప్పటి పాత్రకు చిన్న పిల్లాడెవరినీ తీసుకోకుండా.. సూర్యకు మీసం తీసేసి.. అతడి ముఖాన్నే చిన్న పిల్లాడి లాగా వీఎఫ్ఎక్స్ ద్వారా మార్చి టీనేజీ కుర్రాడిగా చూపించారు. అవి ప్రేక్షకులని చాలా ఇబ్బందికి గురి చేశాయి. ఇక ఆచార్య చిత్రంలోనూ అలాంటి ప్రయోగమే చేశారు. అది బెడిసికొట్టేసింది.
ఫ్లాష్ బ్యాక్ లో చిరంజీవిని యువకుడిగా చూపించాల్సిన అవసరం పడింది. దాంతో కొరటాల శివ చిరు కెరీర్ తొలి నాళ్లలోని ఒక ఫొటోను బయటికి తీసి వీఎఫ్ఎక్స్ ద్వారా ఆ లుక్తోనే చిరు హావభావాలు పలికిస్తున్నట్లు చూపించారు. ఐతే ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్ పూర్తిగా బెడిసి కొట్టేశాయి. చాలా కృత్రిమంగా అనిపించాయి. చిరును అలా చూడలేకపోయారు అభిమానులు. ఎప్పుడెప్పుడు ఆ సన్నివేశం ముగుస్తుందా అనిపించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమాకి నెగెటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉండగా, ఇలాంటి సన్నివేశాలపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…