Kumbhkaran : ఎవరైనా ఎక్కువ సేపు నిద్రపోతే కుంభకర్ణుడిలా పడుకుంటున్నావని చెప్తూ ఉంటారు. మీరు కూడా చాలా సార్లు వినే ఉంటారు. కుంభకర్ణుడు ఆరు నెలల పాటు నిద్రపోయేవాడని చెబుతారు. అయితే, అసలు ఎందుకు కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయేవాడు..?, దాని వెనుక కారణం ఏమిటి..? ఏదైనా శాపం ఉందా లేదంటే ఎవరైనా వరం చేర్చారా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఒకటి, రెండు రోజులు నిద్రపోవడమే కష్టంగా ఉంటుంది. కానీ, కుంభకర్ణుడు ఏకంగా ఆరు నెలల పాటు నిద్రపోయేవాడు.
మన పురాణాల ప్రకారం చూసినట్లయితే కూడా కుంభకర్ణుడు ఆరు నెలలు నిజంగా నిద్ర పోయినట్లు ఉంది. కుంభకర్ణుడి పాత్ర కొంచెం విడ్డూరంగా ఉంటుంది. నమ్మలేని విధంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే, కుంభకర్ణుడు ఎందుకు ఆరు నెలలు నిద్రపోయాడు అనే విషయానికి ఇప్పుడు వచ్చేద్దాం. కుంభకర్ణుడు రావణుడి సోదరుడు. కుంభకర్ణుడు పుట్టగానే దొరికిన జంతువులన్నింటినీ పట్టుకుని తినేస్తూ ఉండేవాడు.
అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు బాణాలు వేసి, కుంభకర్ణుడిని తరిమాడు. అయినా కూడా ఆయనే అతను చేష్టలకి భయపడవలసి వచ్చింది. కుంభకర్ణుడు రావణునితో వెళ్లి, బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాడు. రావణుడి కంటే ఎక్కువ తపస్సు చేయడంతో దేవతలు భయపడిపోయారు. బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లారు. ఈ తపస్సు వల్ల కుంభకర్ణుడు ఏ విద్యను సాధిస్తాడు అని అందరూ ఆందోళన చెందారు. అందుకని బ్రహ్మని కాపాడాలని వేడుకున్నారు. బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం సరస్వతి దేవి కుంభకర్ణుడు నాలుక మీద నిల్చుని ఆరు నెలలు నిద్ర, ఒక రోజు భోజనం కావాలని పలికించింది.
అలా బ్రహ్మ కుంభకర్ణుడు అడిగినట్లే వరమిచ్చాడు బ్రహ్మ. కుంభకర్ణుడి కోసం ప్రత్యేక భవనం, ప్రత్యేక భోజన సౌకర్యం కల్పించారు. కుంభకర్ణుడు తీసే గురకకి అందరి చెవులు చిల్లులు పడేవి. కుంభకర్ణుడి నోటి నుండి వచ్చే గాలికి సైనికులు విసిరినట్లు పడిపోయేవారు. రావణ యుద్ధం సమయంలో కుంభకర్ణుడిని నిద్ర లేపడం ఎంతో కష్టమైంది. సినిమాలో ఈ సీన్లు మీరు చూసే ఉంటారు. అలాగే పురాణాల ప్రకారం ముందు శాపం ఉండడం వలన కుంభకర్ణుడిగా అవతరించినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…