Arjuna : అర్జునుడి గురించి తెలియని వారు ఉండరు. చాలామందికి అర్జునుడి గురించి కొన్ని విషయాలైనా తెలిసే ఉంటాయి. అయితే అర్జునుడి గురించి చాలామందికి తెలియని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృష్ణుడు, అర్జునుడు బంధువులే కాదు. కృష్ణుడు, అర్జునుడు మంచి స్నేహితులు కూడా. వీళ్ళిద్దరూ కలిసి గొప్ప విజయాలని అందుకున్నారు. కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం అప్పుడు అర్జునుడికి సారథిగా ఉండడమే కాకుండా అనేక సందర్భాలలో మరణం నుండి అర్జునుడిని కాపాడాడు.
కలకాలం వీళ్ళ మధ్య స్నేహం కొనసాగింది. అప్పట్లో చాలామంది స్త్రీలు వాళ్ళ హృదయాన్ని అర్జునుడికి అర్పించారు. కానీ ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. ద్రౌపది, సుభద్ర, చిత్రాంగద, ఉలూపి మాత్రమే అతనిని పెళ్లి చేసుకోవడం జరిగింది. వాళ్లే అదృష్ట స్త్రీలు. సర్ప యువరాణి ఉలూపి అర్జునుడిని ప్రేమిస్తుంది. కానీ సర్ప యువరాజు అశ్వసేనకి నచ్చలేదు. చంపడానికి ప్రయత్నిస్తాడు. నరకపు జ్వాలల నుండి ఉలూపి అర్జునుడిని కాపాడడం, తర్వాత ఆమె తన జీవితాన్ని అర్జునుడికి ఇవ్వడం జరిగిపోతాయి.
రామేశ్వరం దర్శించి అక్కడ రాముడు వానరులతో కలిసి లంకకు నిర్మించిన వారధిని చూసి.. ఈ వారధి నిర్మించుటకు ఇంత కష్టం ఏల..? నేను ఈ వారధిని నిమిషంలో నిర్మించగలనని అర్జునుడు అంటాడు. ఓ కోతి పిల్ల నీవు నిర్మించు. నేను దానిమీద నిలబడతాను. అలా నిర్మించిన వారధి పడిపోకుండా ఉంటే, నేను నీకు బానిసత్వము చేసెదను. పడిపోయి ఉంటే నీవు నాకు చేయాలి.. అంటుంది. అర్జునుడు పరిహాసముగా వెంటనే వారధిని నిర్మించగా, ఆ కోతి పిల్ల అడుగు వేయగానే వారధి కూలిపోయింది. మళ్లీ నిర్మిస్తే, మళ్లీ కోతి పిల్ల విరగ్గొడుతుంది.
అర్జునుడు ఓడిపోయానని ఒప్పుకుని ఆ కోతికి బానిసత్వము చేయబోవుటకై సంసిద్ధుడు కాగా ఓ బ్రాహ్మణ బాలుడు అక్కడికి వచ్చి, విషయం గ్రహించి మధ్యవర్తిత్వము లేని పందెం న్యాయబద్ధం కాదని, నేను మధ్యవర్తిగా వుంటాను. మీరు మరలా పందెం కొనసాగించాలని కోరుతాడు. అందుకు ఇద్దరూ సమ్మతించుగా అర్జునుడు వారధిని నిర్మిస్తాడు. ఆ వానరుడు తన శరీరమును ఎంత పెంచినా అది విరగలేదు. అర్జునుడు, ఆ కోతి ఆశ్చర్యపోయారు. ఆ బ్రాహ్మణ బాలుడు శ్రీకృష్ణుడని, ఆ వానరం ఆంజనేయుడని అర్జునుడు గ్రహిస్తాడు. శ్రీకృష్ణుని కోరిక మేరకు అర్జునుడి రథం జెండాపై ఆంజనేయుడు ఉండడానికి అంగీకరిస్తాడు. ఈ తీర్థయాత్ర సమయంలోనే అర్జునుడు ద్వారకకు వెళ్లి సుభద్రని పెళ్లి చేసుకుంటాడు. వారికి అభిమన్యుడు పుడతాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…