Masala Egg Fry : కోడిగుడ్లతో చేసే ఏ వంటకాన్నయినా చాలా మంది ఇష్టంగానే తింటారు. కోడిగుడ్లతో మనం అనేక రకాల వంటలను చేసుకుని తినవచ్చు. వాటిల్లో ఒకటి మసాలా ఎగ్ ఫ్రై. కోడిగుడ్లను ఉడకబెట్టి, మసాలా వేసి వండుకుని తింటే వచ్చే మజాయే వేరు. మరి మసాలా ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో, తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఉడకబెట్టిన కోడి గుడ్లు – 4, ఉల్లిపాయలు – 1 కప్పు, టమాటాలు – 1 కప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ – 1 కప్పు, పచ్చిమిర్చి – 5, కారం – అర టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, ధనియాల పొడి – అర టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – తగినంత.
టమాటాలు, వెల్లుల్లి రెబ్బలను తీసుకుని కట్ చేసి వాటిలో నీరు పోసి వాటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టాలి. పాత్రలో నూనె పోసి వేడి చేసి అందులో సన్నగా కట్ చేసిన పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. అనంతరం ముందుగా పట్టుకున్న టమాటా, వెల్లుల్లి పేస్ట్ను వేయాలి. వాసన పోయే వరకు మిశ్రమాన్ని ఫ్రై చేయాలి.
అనంతరం అందులో పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి ఫ్రై చేయాలి. మొత్తం మిశ్రమం బాగా ఫ్రై అయ్యాక అందులో ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలను వేసి మళ్లీ ఫ్రై చేయాలి. తరువాత ఉప్పు వేసి, చివరిగా కొత్తిమీర తరుగును అలంకరించాలి. దీంతో ఘుమ ఘుమలాడే మసాలా ఎగ్ ఫ్రై తయారవుతుంది. దీన్ని చపాతీలు లేదా అన్నంతో తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…