Eating On Cot : చాలామంది తెలియక కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు. కొన్ని తప్పులు చేయడం వలన, మనమే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు ప్రకారం, ఈ తప్పులను చేయకుండా చూసుకోవాలి. కొంతమంది, మంచం మీద కూర్చుని తింటూ ఉంటారు. పెద్దలు అలా వద్దని చెప్పినా కూడా, ఆ మాటని కొట్టి పారేస్తూ ఉంటారు. మంచం మీద కూర్చుని తినడం వలన, కొన్ని సమస్యలు అయితే వస్తాయట. మంచం మీద కూర్చుని తింటే, వాస్తు ప్రకారం ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడే చూద్దాం.
ప్రతి ఒక వ్యక్తికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లు మంచివా..? కావా..? అన్నది ఆలోచించుకోరు. ఇటువంటి తప్పులు చేయడం వలన, సమస్యలు వస్తాయి. ఈశాన్యంలో బరువుని పెట్టడం, లక్ష్మీదేవిలా భావించే గడప మీద కూర్చోవడం వంటివి చాలా తప్పు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయడం వలన, ఇబ్బందులు వస్తాయి. వాస్తు ప్రకారం ఈ అలవాట్లు కూడా ఉండకూడదు. ఇవి లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని కలిగిస్తాయి.
చాలామంది, మంచం మీద కూర్చుని ఆహారాన్ని తింటూ ఉంటారు. వాస్తు ప్రకారం, లక్ష్మీదేవికి మంచం మీద కూర్చుని తినడం వలన, కోపం వస్తుంది. ఆ ఇంటి నుండి కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళు వెళ్తూ లక్ష్మీదేవి డబ్బుని, సంతోషాన్ని తీసుకువెళ్లి పోతుంది. అందుకని మంచం మీద కూర్చుని అసలు తినకూడదు. మంచం మీద కూర్చుని తింటే ఆనందం, శాంతి కూడా పోతాయి. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వలన కుటుంబ సభ్యులపై అప్పులు కూడా పెరిగిపోతాయి.
మంచం మీద కూర్చుని ఆహారం తినే వ్యక్తి, నరకానికి వెళ్తాడని కూడా పురాణ గ్రంథాల్లో చెప్పబడింది. కాబట్టి, ఇలా ఎప్పుడు చేయకండి. ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటారు చాలామంది. అది కూడా, అస్సలు మంచిది కాదు. ఉదయం లేవగానే దేవుడు ని చూడడం మంచిది. రాత్రి పడుకున్నాక, ఉదయం లేవగానే మంచాన్ని సరిగ్గా సర్దుకోవాలి. ఎప్పుడు మంచాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
అప్పుడే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. మంచం పై చెత్తాచెదారం, దుమ్ము ధూళి వంటివి లేకుండా చూసుకోవాలి. లేదంటే డబ్బులు లేకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే, ఈ తప్పు జరగకుండా చూసుకోండి. చాలామంది రాత్రి పూట భోజనాలు అయిపోయిన తర్వాత వంటగదిని మురికి గా ఉంచేస్తారు. తినేసిన వాటిని అన్నిటిని, వంటగదిలోనే ఉంచేస్తారు అలా చేయడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…