Garuda Puranam : సూర్యాస్తమయం అయిన తర్వాత, కొన్ని తప్పులు అసలు చేయకూడదు. సూర్యాస్తమయం అయిన తర్వాత, ఈ తప్పులు చేస్తే, ఇబ్బందిని ఎదుర్కోవాలి. ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. కానీ, కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమయం అయ్యాక వీటిని చేయకూడదు. వీటిని కచ్చితంగా ఆచరించాలి. వీటిని కనుక మీరు ఆచరించకపోయినట్లయితే, సమస్యలు వస్తాయి. గరుడ పురాణం ప్రకారం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం.
తప్పనిసరిగా, లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే, ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా లేకపోతే, లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి పరిశుభ్రతను ఇష్టపడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. పరిశుభ్రత, ప్రేమ, నమ్మకం లేని చోట లక్ష్మీదేవి ఉండదు. సాయంత్రం పూట సూర్యాస్తమయం అయ్యాక, ఇంటిని తుడవడం మంచిది కాదు అని గరుడ పురాణం చెప్తోంది.
కాబట్టి, సూర్యాస్తమయానికి ముందే, ఇంటిని వచ్చి శుభ్రపరచుకోవాలి. అలా కాకుండా, సూర్యుడు అస్తమించిన తర్వాత ఇల్లు శుభ్రం చేస్తే, లక్ష్మీదేవికి కోపం వస్తుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత, ఎట్టి పరిస్థితిలో కూడా వీటిని దానం చేయడం మంచిది కాదు. సూర్యాస్తమయం అయ్యాక, కొన్ని వస్తువుల్ని దానం చేయకూడదు.
పెరుగు, పచ్చళ్ళు, పాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఉప్పు వంటివి సూర్యాస్తమయం అయ్యాక ఎట్టి పరిస్థితుల్లో దానం చేయకూడదు. ఈ విషయం గరుడ పురాణంలో చెప్పబడింది. అలానే, సూర్యాస్తమయం అయిన తర్వాత తులసి మొక్కకి నీళ్లు పోయకూడదు. తులసిని లక్ష్మీదేవితో పోలుస్తారు. అందుకని, తులసిని అతి పవిత్రంగా చూస్తారు.
చాలామంది, హిందువుల ఇళ్లలో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసికి నీళ్లు పోయడం తో చాలా మంది రోజుని మొదలు పెడతారు. తులసిని పూజిస్తే, ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. తులసి మొక్కకి సూర్యాస్తమయం అయ్యాక, నీళ్లు పోయకూడదు. ఇలా ఈ తప్పులు చేయకుండా చూసుకోండి, లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్ను పట్టించుకుంటే ముందుకు…
సినిమాలు ఎంత బాగున్నప్పటికీ కొందరు రివ్యూయర్లు ఇచ్చే రివ్యూల కారణంగా నెగెటివ్ టాక్ వస్తుందని, దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం…