Badusha : భారతీయులు ఎప్పటి నుంచో తయారు చేస్తున్న సంప్రదాయ పిండి వంటల్లో బాదుషా కూడా ఒకటి. దీన్నే బాలుషాహి అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. సాధారణంగా ఈ తీపి వంటకాన్ని చాలా మంది పండుగలప్పుడు లేదా ఏదైనా శుభాకార్యాల సమయంలో చేసుకుని తింటుంటారు. ఈ క్రమంలోనే ఈ వంటకం రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేంత తియ్యగా బాదుషాలు ఉంటాయి. అయితే కొంచెం కష్టపడాలే గానీ మనం కూడా అలాంటి అద్భుతమైన, తియ్యని బాదుషాలను చేసుకుని తినవచ్చు. మరి బాదుషాలను ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
బాదుషా తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, పెరుగు – 3 టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా – 1/4 టేబుల్ స్పూన్, ఉప్పు – 1/2 టేబుల్ స్పూన్, మైదా పిండి – 1 కప్పు, చక్కెర – ఒకటిన్నర కప్పు, నీళ్లు – 1/2 కప్పు, యాలకుల పొడి – 1/4 టేబుల్ స్పూన్.
బాదుషాలను తయారు చేసే విధానం..
ముందుగా ఒక గిన్నెలో కాస్త నెయ్యిని తీసుకోవాలి. దానికి పెరుగు కలపాలి. అందులోనే బేకింగ్ సోడా, ఉప్పు, మైదా వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమం చేతికి అంటుకోకుండా ఉండేలా చూసుకోవాలి. అప్పటి వరకు దాన్ని బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమం నుంచి కొద్ది కొద్దిగా ఉండలను తీసుకుని బాదుషాలలా తయారు చేసుకోవాలి. వాటికి మధ్యలో రంధ్రాలను చేయాలి. అనంతరం వాటిని నూనెలో బంగారు వర్ణం వచ్చే వరకు బాగా వేయించాలి. ఆ తరువాత వాటిని పక్కన పెట్టాలి. అనంతరం చక్కెర పాకం తయారు చేసుకోవాలి. అందులో యాలకుల పొడి కలపాలి. వెంటనే ముందుగా వేయించి పెట్టుకున్న బాదుషాలను వేయాలి. అలా కొంత సేపు ఉంచాక చక్కెర పాకం మొత్తం బాదుషాలలోకి చేరుతుంది. అంతే.. తియ్య తియ్యని బాదుషాలు రెడీ అవుతాయి. వాటిని ఎంచక్కా ఆరగించవచ్చు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…